బిహార్‌కి ప్రత్యేకంగా ఐపీఎల్ టీమ్?

Publish Date:May 23, 2026

Advertisement

ఐపీఎల్‌లో బీహారీలు మెరుపులు మెరిపిస్తున్నారు. పాట్నాలో జన్మించిన  ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమై డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమై డబుల్ సెంచరీతో రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపిస్తూ అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్‌ను పరిచయం చేశాడు.

బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రంతోనే అబ్బుర పరుస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను భయపెడుతూ తానేంటో నిరూపించుకుంటున్నాడు.  వీరితో పాటు బీహార్   గోపాల్‌గంజ్‌కు చెందిన సాకిబ్ హుస్సేన్ కూడా తన పదునైన బౌలింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 

దేశంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్, 5 సార్లు సీఎస్కేని ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన  మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఉమ్మడి బీహార్‌లోని రాంచీలో జన్మించిన సంగతి తెలిసిందే. ఇలా బీహార్ క్రికెటర్ల అద్భుత ప్రదర్శన చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత రీసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరహాలోనే బీహార్‌కు కూడా ఒక ప్రత్యేకమైన ఐపీఎల్ జట్టు ఉండాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. 

బీహార్ మట్టిలో ఎంతో మంది అసాధారణ క్రికెటర్లు ఉన్నారని, బీహార్‌కు సొంత జట్టు వస్తే ఇక్కడి యువతకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. బీహార్ నుంచి వచ్చే జట్టు ప్రపంచంలోనే అత్యత్తమ జట్టుగా నిలుస్తుందన్నారు. ఐపీఎల్‌లో నాలుగేళ్ల కిందట రెండు ఫ్రాంచైజీలు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా వచ్చాయి. ఇప్పటికే ఐపీఎల్ మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరగడంతో కొత్త ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఏపీ నుంచి ఒక, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి ఒక ఫ్రాంచైజీకి అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు బిహార్‌కు చెందిన బిలియనీర్ నేరుగా రంగంలోకి దిగడంతో ఐపీఎల్ మేనేజ్ మెంట్ ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.