ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్.. ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా!

Publish Date:Apr 17, 2026

Advertisement

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన   ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు స్లో ఓవర్ రేట్ ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. నిర్ణీత సమయం కంటే గంటల తరబడి మ్యాచ్ లు కొనసాగుతూ ఉండడానికి, ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారడానికి స్లో ఓవర్ రేట్ కారణమంటున్నారు క్రికెట్ పండితులు.  స్లో ఒవర్ రేట్ కు ప్లేయర్లకు జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదంటున్నది  మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. ఎంసీపీ క్రికెట్ విభాగం అధిపతి ఫ్రేజర్ స్టీవర్ట్  అయితే.. స్లో ఓవర్ రేట్ సమస్యకు ఆటగాళ్లను మాత్రమే బాధ్యులను చేయడం  కాదని, దీనికి అంపైర్లను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సుమారు 4 గంటల 22 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచ్‌ను స్వయంగా వీక్షించిన స్టీవర్ట్.. ఆట సాగిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్ మార్పులు, ఆటగాళ్ల మధ్య చర్చలు, అనవసర విరామాల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.  ఈ నేపథ్యంలోనే ముంబైలో జరిగిన  ఒక కార్యక్రమంలో  మాట్లాడిన ఆయన.. అంపైర్ల ఉదాశీనత వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదైతే కేవలం జట్టు కెప్టెన్లకు లేదా ఆటగాళ్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నారు. కానీ మైదానంలో నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగిసేలా చూడాల్సిన బాధ్యత ఉన్న అంపైర్లకు కూడా జరిమానా విధించితేనే ఈ సమస్య పరిష్కారమౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 నియమావళిలో ఆట వేగాన్ని మందగింప చేసేలా వ్యవహరిస్తున్న ఆటగాళ్లకు, జట్లకు హెచ్చరికలు చేసే అధికారం, ఐదు పరుగుల పెనాల్టీ విధించే అధికారం, అవకాశం అంపైర్లకు ఉందనీ, వారు మాత్రం ఆ అధికారాన్నీ, అవకాశాన్ని ఉపయోగించకుండా ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే స్లో ఓవర్ రేట్ సమస్య తలెత్తుతోందని ఫ్రేజర్ స్టీవర్ట్  విమర్శించారు. అంపైర్లు కఠినంగా వ్యవహరించనంత కాలం మ్యాచ్‌లు ఇలాగే సాగుతాయని, ఒకవేళ ఓవర్ రేట్ తగ్గితే అంపైర్ల వేతనంలో కోత విధించేలా నిబంధనలు తీసుకువస్తే మార్పు వస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను బీసీసీఐకి కూడా చెప్పానని తెలిపాడు.  చూడాలి మరి ఎంసీసీ ప్రతిపాదనపై బీసీసీ ఎలా స్పందిస్తుందో?

By
en-us Political News

  
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే, కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు.
సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.