Publish Date:Apr 24, 2026
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 24) బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగిన మ్యాచ్ లో పాత రికార్డులు బద్దలయ్యాయి. కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు.
గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 58 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్లు) పేరిట ఉండగా, సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించి గిల్ ను వెనక్కు నెట్టేశాడు.
మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సాయి సుదర్శన్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్ల్లో మంచి ఆరంభాలు లభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాననీ ఈ మ్యాచ్లో సెంచరీ సాధించడం ఆత్మవిశ్వాసాన్ని నింపిందనీ పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి తాను ఆడానని, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడం సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు.
ఇక కింగ్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడా బౌలింగ్లో బౌండరీ కొట్టడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ తరువాతి స్థానాలలో శిఖర్ ధావన్ (768), డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వీరుడుగా ఇప్పటికే కొనసాగుతున్న కోహ్లీ, ఇప్పుడు ఫోర్ల సంఖ్యలోనూ అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతే కాదు ఐపీఎల్ లో 9 వేల పరుగుల మైలు రాయికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. తరువాతి మ్యాచ్ లోనే ఆ రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పోతే కింగ్ విరాట్ కోహ్లీ కేవలం ఫోర్లతోనే ఆగకుండా సిక్సర్ల విషయంలోనూ ఘనత సాధించాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ 300 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గత 18 ఏళ్లుగా ఆర్సీబీకి కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flurry-of-records-in-the-ipl-36-218201.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.