కోచ్ కోసం విద్యార్థుల ఆందోళన.. సరూర్‌నగర్ స్టేడియంలో రెండో రోజూ నిరసన..!

Publish Date:Aug 23, 2026

Advertisement

 

సరూర్‌నగర్ స్టేడియంలో క్రికెట్ కోచ్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగుతోంది. గత మూడు నెలలుగా స్టేడియంలో క్రికెట్ కోచ్ లేకపోవడంతో విద్యార్థులు శిక్షణకు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌పై ఆసక్తితో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్టేడియానికి వస్తున్నప్పటికీ.. వారికి సరైన మార్గనిర్దేశం చేసే కోచ్ లేకపోవడంతో శిక్షణకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. 

మూడు నెలలు గడిచినా అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరూర్‌నగర్ స్టేడియంలో వెంటనే అర్హత కలిగిన క్రికెట్ కోచ్‌ను నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కోచ్ అందుబాటులో ఉంటే విద్యార్థులకు క్రమం తప్పకుండా శిక్షణ అందించడంతో పాటు వారి ప్రతిభను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

స్టేడియంలో ఉన్న క్రీడా సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్‌పై వెంటనే స్పందించి కోచ్‌ను నియమించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు హెచ్చరించారు. మూడు నెలలుగా కొనసాగుతున్న కోచ్ కొరతపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

Saroornagar Stadium, Cricket coach, CM Revanth reddy, Telangana government

By
en-us Political News

  
అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ  సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు.
 మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై సోమవారం  హైకోర్టు విచారించనుంది. 
డిమాండ్ల సాధన కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.  ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  
గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు అధిష్ఠానం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్‌కానా వద్ద ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్..!
ప్రియురాలికి కిడ్నాప్ మెసేజ్ పంపడంతో బట్టబయలైన వ్యవహారం..!
మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై విమర్శలు.. ప్రీతిరెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.