ప‌ది మందిని కంటే రూ.13 ల‌క్ష‌లు... అమ్మ‌ల‌కు పుతిన్ ఆఫ‌ర్‌!

Publish Date:Aug 18, 2022

Advertisement

పూర్వం అంత‌టా సంతాన‌ల‌క్ష్ములే ఉండేవారు. దాదాపు ప్ర‌తీ ఇల్లూ పిల్ల‌ల‌తో సంద‌డిగా ఉండేది. కాల క్ర‌మంలో సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చింది. ఇపుడిక ఆధునిక పోక‌డ‌ల‌వ‌ల్ల‌, సామాజిక ప‌రిస్థితుల వ‌ల్లా ఒక్క‌రి ద్ద‌రితో స‌రిపెట్టుకుంటున్నారు.  ర‌ష్యాలో అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం మ‌ళ్లీ పిల్ల‌ల సంద‌డి అవ‌స‌ర‌మ‌ని భావించారు. అంటే జ‌నాభా పెరుగుద‌ల‌ను ఆశిస్తున్నారు. కార‌ణం కోవిడ్‌-19 కావ‌చ్చు. కోవిడ్ వ‌ల్ల  అనేక దేశాల్లో జ‌నాభా త‌గ్గిపోయింది. ర‌ష్యా కూడా దాని ప్ర‌భావానికి గురైంది.          

కనీసం పది మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్  ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన నైరాశ్యంతో కూడిన చిట్టచివరి ప్రయత్నమని నిపుణులు చెప్తున్నారు. 

జనాభా క్షీణతను అరికట్టేందుకు పుతిన్ ఓ పథకాన్ని ప్రకటించారు. దీనికి మదర్ హీరోయిన్  అని పేరు పెట్టారు. ఈ పథకం క్రింద ప‌దిమంది బిడ్డలకు జన్మనిచ్చే తల్లికి ఆర్థిక సాయం చేస్తారు. అయి తే ప‌ది మంది బిడ్డలు జీవించి ఉండటం తప్పనిసరి.  పదో బిడ్డకు మొదటి పుట్టినరోజు నాటికి ఒక మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.13 లక్షలు) చెల్లిస్తారు.  ఈ ఏడాది మార్చి నుంచి రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉండటం, ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల మరణించినవారి సంఖ్య 50వేల‌కు చేరుతుండ టం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 

పుతిన్ ప్రకటించిన మదర్ హీరోయిన్ పథకం నైరాశ్యంలో చేపట్టిన అంతిమ ప్రయత్నమని రష్యన్ రాజకీ య, భద్రత రంగాల నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ చెప్పారు. క్షీణిస్తున్న జనాభా సమస్యను పరిష్క రిం చేందుకు దీనిని అమలు చేస్తున్నారన్నారు. పెద్ద కుటుంబాలవారు ఎక్కు వ దేశభక్తిని కలిగి ఉంటారని పుతిన్ చెప్తున్నారని అన్నారు. ఇది సోవియెట్ యూనియన్ కాలంనాటి ప్రోత్సాహకమని చెప్పారు. అయితే ఆర్థిక సాయం కోసం పెట్టిన షరతు వింతగా ఉందన్నారు.

జనాభా తగ్గిపోతుండటం 1990వ దశకం నుంచి ప్రారంభమైందన్నారు. కోవిడ్, ఉక్రెయిన్‌పై యుద్ధం సమస్యను తీవ్రతరం చేశాయని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి రష్యన్ మహిళలను ప్రోత్సహించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే ఈ డబ్బు కోసం ప‌ది మంది పిల్లల్ని పెంచడానికి ఎవరు ముందుకొస్తారన్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళంతా ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. రష్యాలో చాలా ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలు ఉన్నాయని చెప్పారు. 

By
en-us Political News

  
చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కా ల్పుల్లో 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు.
​వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టి అప్పుల‌పాలు చేసి ప్ర‌జ‌ల నెత్తిమీద భారం మోపాడు. 
జగన్ పాలనలో ప్రజలకు జీఎస్టీతో పాటు జీ టాక్స్ భారం పడిందని విజయవాడ లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసులలో నియామకాల  కోసం ప్రతి  యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యానికి రాకుండా..తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని...ఈ ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్క‌డా అభివృద్ది జ‌ర‌గ‌లేదు అంతా శూన్యమ‌ని టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ది కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవి అన్నారు.
తెలంగాణలో ముక్కోడిని  ఇంటికి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్‌లో తిక్కోడు కూడా ఇంటికి పోతాడు
పదేళ్ల పాటు తెలంగాణలో  చక్రం తిప్పిన బిఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ఇల్లు లేదా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. ఓటమి నుంచి తేరుకోకమునుపే కూతురు కవిత తీహార్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెట్టడం కెసీఆర్ ను కలచివేసింది.
ఒక్క ఛాన్స్ అంటూ మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మాట త‌ప్పాడు. ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మ‌ధ్య‌పాన నిషేధం చేస్తాన్న జ‌గ‌న్ ఆ మాట మ‌ర్చిపోయాడు. ఇచ్చిన మాట‌ను తప్పిన జ‌గ‌న్ కి నైతికంగా ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే హ‌క్కులేద‌ని తెలుగుదేశం విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ అన్నారు.
గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన మాజీ సి ఎం  కెసీఆర్ కూతురు కవితకు బెయిల్ ఇప్పట్లో లభించేలా లేదు.
అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో
సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.  ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.