అమరావతి రాజధాని కోసం ఎందాకైనా..!

Publish Date:Aug 18, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

ఇంతకు ముందు వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమల వరకు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి విదితమే. జగన్   నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించినా.. నిబంధనలు, నిర్బంధాలు పెట్టినా మొక్కవోని దీక్షతో రాజధాని ప్రాంత రైతులు తొలి మహా పాదయాత్రను విజయవంతంగా ముగించారు. తొలిదశలో చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది.

అదే స్ఫూర్తితో.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఇప్పుడు రైతులు మళ్లీ మరో మహా పాదయాత్రకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం. అమరావతి పరిధి వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాద్రయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధికి చేరుకోవడంతో మలి దశ మహా పాదయాత్రను ముగిస్తారు. రెండు నెలలు కొనసాగే ఈ మహా పాదయాత్ర సందర్భంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని అనేక గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకు యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను ఉద్యమిస్తున్న రైతు సంఘాల జేఏసీ సిద్ధం చేసింది.  తుళ్లూరు సాయిబాబా కల్యాణ మండపంలో భేటీ అయిన రైతు సంఘాల జేఏసీ మలి దశ పాదయాత్ర ప్రారంభించే సెప్టెంబర్ 12కు ముందు రోజున దీక్షా శిబిరంలో హోమం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిగా అమరావతినే నిర్ణీత కాలంలోగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పినా ముడు ముక్కలాటకు వైసీపీ సర్కార్ తెర దించకుండా కొత్త జిత్తులు, ఎత్తులతో ముందుకు సాగుతున్నది.

కోర్టు తీర్పుతోనైనా జగన్ సర్కార్ కు జ్ఞానోదయం కలుగుతుందని ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఆశించారు. అయినా.. ప్రభుత్వం పాత పాటే పాడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని ఏపీ సర్కార్ బేషరతుగా ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని పోరాట కమిటీ తెగేసి చెప్పింది. ఈ క్రమలోనే రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొనే మరో మహా పాదయాత్రకు రైతు సంఘాల జేఏసీ  సిద్ధం అవుతోంది. ఈ మహా పాద యాత్రలో అమరావతి రైతులకు తెలంగాణ రైతులు, హైదరాబాద్ వాసులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెబుతున్నారు.

కాగా.. మహా పాదయాత్రకు అందరూ సహకరించాలని, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రాష్ట్రంలోని రైతులు ముందుకు రావాలని అమరావతి రైతుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, లీగల్ కమిటీ, మహిళా ఐక్య కార్యాచరణ సమితి, దళిత ఐక్య కార్యాచరణ నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలతో దిగిరాని వైసీపీ సర్కార్ కు తాజాగా తలపెట్టిన మరో మహా పాదయాత్రతోనైనా జ్ఞానోదయం అవుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇప్పటికై జగన్  తన మొండి పంతాన్ని వీడి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కా ల్పుల్లో 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు.
​వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టి అప్పుల‌పాలు చేసి ప్ర‌జ‌ల నెత్తిమీద భారం మోపాడు. 
జగన్ పాలనలో ప్రజలకు జీఎస్టీతో పాటు జీ టాక్స్ భారం పడిందని విజయవాడ లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఖిల భారత సర్వీసులలో నియామకాల  కోసం ప్రతి  యేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యానికి రాకుండా..తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని...ఈ ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్క‌డా అభివృద్ది జ‌ర‌గ‌లేదు అంతా శూన్యమ‌ని టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ది కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవి అన్నారు.
తెలంగాణలో ముక్కోడిని  ఇంటికి పంపించేశాం.. ఆంధ్రప్రదేశ్‌లో తిక్కోడు కూడా ఇంటికి పోతాడు
పదేళ్ల పాటు తెలంగాణలో  చక్రం తిప్పిన బిఆర్ఎస్  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ఇల్లు లేదా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. ఓటమి నుంచి తేరుకోకమునుపే కూతురు కవిత తీహార్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెట్టడం కెసీఆర్ ను కలచివేసింది.
ఒక్క ఛాన్స్ అంటూ మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మాట త‌ప్పాడు. ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మ‌ధ్య‌పాన నిషేధం చేస్తాన్న జ‌గ‌న్ ఆ మాట మ‌ర్చిపోయాడు. ఇచ్చిన మాట‌ను తప్పిన జ‌గ‌న్ కి నైతికంగా ప్ర‌జ‌ల‌ను ఓటు అడిగే హ‌క్కులేద‌ని తెలుగుదేశం విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ అన్నారు.
గత నెల రోజుల క్రితం అరెస్ట్ అయిన మాజీ సి ఎం  కెసీఆర్ కూతురు కవితకు బెయిల్ ఇప్పట్లో లభించేలా లేదు.
అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో
సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.  ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.