Publish Date:Mar 19, 2025
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ ను పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. అయితే కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడానికి ప్రధాన కారణం ప్రధాన నిందితులు విదేశాల్లో ఉండటమే. వారు తిరిగి వస్తే కానీ దర్యాప్తు ముందుకు సాగదు. ప్రధాన నిందితులైన ఎస్ ఐబి మాజీ ఓ ఎస్టీ ప్రభాకర్ రావు, మరో కీలక నిందితుడు అరువెల్ల శ్రవణ్ రావ్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి .ఇంటర్ పోల్ నుంచి సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి సమాచారమందడంతో హైద్రాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరిరువురిని అదుపులో తీసుకుని కేంద్రానికి అప్పగించే పనిలో ఇంటర్ పోల్ ఉంది. వారిద్దరిని సాధ్యమైనంత త్వరగా ఇండియా తీసుకురావడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైద్రాబాద్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిద్దరిని అమెరికాలో తాత్కాలిక (ప్రొవిజినల్ ) అరెస్ట్ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియా పంపే అవకాశం ఉంది. ప్రొవిజినల్ అరెస్ట్ ను నిందితులు అక్కడి కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ప్రొవిజినల్ అరెస్ట్ అని నిందితులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం లేకపోలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/progress-in-phone-tapping-case-red-corner-notices-issued-to-accused-39-194649.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.