Publish Date:Oct 12, 2019
తమిళనాడు లోని మహాబలిపురం లో అర్జున తపస్సు ప్రదేశాన్ని విశిష్ట అతిథి జిన్ పింగ్ కు మోదీ వివరించారు. ప్రతి స్తంభాన్ని శిల్ప సంపదను జిన్ పింగ్ కు చాలా ఆత్మీయంగా మోదీ వివరించారు. రెండు అగ్ర దేశాధినేతల ఆత్మీయ సమావేశాన్ని ప్రపంచం అంతా చాలా ఆసక్తికరంగా చూస్తోంది. ఇరుదేశాధినేతల ఈ సమావేసం భవిష్యత్ శుభ పరిణామానికి నాందిగా ప్రపంచ విశ్లేషకులు భావిస్తున్నారు. స్నేహ హస్తాన్ని అందించటంలో మోదీ స్టైలే వేరు, అందరి కంటే ఒకడుగు ముందుకు వేసే ఊహించని రీతిలో ఆయన స్నేహా స్వభావం ఉంటుంది.
భారతదేశ సంప్రదాయ వస్త్రధారణ నేటి తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లోని సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో దర్శనమిస్తూ ఓ అతిపెద్ద దేశాధినేతకు మహాబలిపురంలోని ఆలయాన్ని వివరించారు. ఆలయాలపై ఉన్న శిల్పా సంపదను మోదీ ప్రత్యేకంగా వివరించారు. శిల్ప సంపదకు పుట్టినిల్లు భారతదేశం అద్భుతమైన శిల్పాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. తమిళనాడు మహాబలిపురంలో అర్జున తపస్సు ప్రదేశం తో చైనాకు భారతదేశాని కి అవినాభావ సంబంధముంది.
ఇక్కడ నుంచి వాణిజ్య సంబంధాలను నెరిపేవారు, అందులో భాగంగానే మోదీ విదేశాంగ విధానంతో పాటు దక్షిణ భారతదేశంలో తమిళనాడుని ఆతిథ్య ప్రదేశంగా ఎంచుకోవడంలో ఆయన ఆలోచనే వేరు. పంచెకట్టులో రాజసంగా మోదీ నడుచుకుంటూ వెళుతుంటే పక్కనే మరో అగ్రదేశాధినేత ఆయనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఈ స్నేహం ఎటువంటి శుభ పరిణామాలకు దారి తీయబోతోందని ప్రపంచం చర్చించుకుంటోంది. కానీ, పాకిస్థాన్ మాత్రం ఏం జరుగుతుందో అని కంటవిప్పుతో చూస్తూ ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prime-minister-narendra-modi-appears-in-panchekattu-at-mahabalipuram-25-89978.html
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.