పెంపులతో సామాన్యుడి (ఇం)ధనం ఆవిరి!
Publish Date:Sep 12, 2012
Advertisement
ఇంధన ధరల పెంపు ప్రతిపాదన వచ్చే వారానికి వాయిదా పడింది. పెట్రోల్తో సహా ఇతర ఇంధన ధరలను తక్షణమే పెంచే ఆలోచనైతే లేదని కేంద్ర చమురుశాఖా మంత్రి స్పష్టం చేశారు. ఆయనే సామాన్యులపై పెనుభారం మోపే ఇంధన ధరల పెంపు బాధాకరమైన నిర్ణయమైనప్పటికి తీసుకోక తప్పదని కూడా ఆయన సెలవిచ్చారు. ‘అహా! ఆయనకు సామాన్య ప్రజలపై ఎంత ప్రేమ. ఒకవారంరోజుల పాటు ధరలు పెంచకుండా వాయిదా వేసి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నియంత్రిత ధరలకు డీజిల్, ఎల్పిజి, కిరోసిన్ విక్రయించడంతో ఐఓసి, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ సంస్థలు రోజుకు రూ.560 కోట్లు నష్టపోతున్నాయి. సబ్సిడీ ధరలకు విక్రయించడం వల్ల లీటర్ డీజిల్పై రూ19.28, కిరోసిన్పై రూ.34.34, ఇంట్లో వాడుకునే వంటగ్యాస్ సిలిండర్ ఒక్కింటికి రూ. 347 నష్టం చవిచూడాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్పై నియంత్రణ ఎత్తివేసినప్పటికి పార్లమెంట్ సమావేశాలు కొనసాగడంతో ధర పెంచడానికి కేంద్ర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అనుమతివ్వలేదు. అంటూ చెప్పుకొచ్చారు. వాయిదాపడే కొద్దీ పెంపుకూడా పెరుగుతుంటుంది. ఏతావాతా చెప్పేదేంటయ్యా అంటే ` మోటారు బండ్ల కంటే ఎడ్లబండ్లే శ్రేయస్కరమని! ఇది చాణ్యుకునికి సైతం అందని రాజనీతి.
http://www.teluguone.com/news/content/petrol-hike-postponed-24-17316.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.





