ఏపీలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆ నియోజక వర్గం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఇపుడు పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. దీనికి కారణం పయ్యావుల కేశవ్, వైసిపి నేత విశ్వేశ్వరరెడ్డి మధ్య సాగుతున్న ఆధిపత్య పూరి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాదు. ఎమెల్యే ఒక పార్టీ నేత ఉంటే రాష్ట్రంలో అధికారంలో మరో పార్టీ ఉంటుంది. దీంతో ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్న ఓడిపోయిన అభ్యర్థుల నుంచి ఐదేళ్ల పాటు ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పయ్యావుల కేశవ్ వర్సెస్ విశ్వేశ్వరరెడ్డి మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఒక పంచాయతీ విభజన అంశం ఇద్దరి మధ్య వార్ కు తెరలేపింది. నియోజకవర్గంలో పెద్ద కౌకుంట్ల పంచాయితీ చాలా పెద్ద గ్రామ పంచాయితీ పెద్ద కౌకుంట్ల పరిధిలో ఐదు గ్రామాలున్నాయి. అయితే పరిపాలన సౌలభ్యం కోసం రెండు పంచాయతీలుగా విభజించాలని అధికారులనుకుంటున్నారు.
ఇందు కోసం గ్రామ సభ నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే ఇదే పెద్ద వివాదానికి కారణమైంది. పెద్ద కౌకుంట్ల పంచాయితీ టిడిపికి చాలా బలమైన పంచాయితీ. కేశవ్ గెలుపులో ఈ పంచాయితీ చాలా కీలక పాత్ర పోషించింది. ఈ పంచాయితీలో ఇచ్చిన తీర్పే ఇక్కడ ఎమ్మెల్యేని డిసైడ్ చేసింది. అందుకే ఈ పంచాయితీని విడదీయడం వల్ల గ్రామాల్లో పరిస్థితులు మారుతాయన్న భావనలో టిడిపి నేతలు ఉన్నారు. అదే సందర్భంలో ఈ పంచాయితీని విభజించి తీరాల్సిందేనని విశ్వేశ్వరరెడ్డి పట్టుబడుతున్నారు. ఇన్ని రోజులు పయ్యావుల కేశవ్ చర్యల వల్లనే ఇది జరగలేదని ఇపుడు దీనిని కూడా అడ్డుపెట్టుకోవడం సరైన చర్య కాదని ఆయన మండిపడుతున్నారు.
దీంతో సోమవారం జరిగిన గ్రామ సభలో హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. మూడు రోజుల క్రితం హెచ్చెల్సీ నీరు విడుదల చేయాలంటూ పయ్యావుల కేశవ్ కాలువ గట్ల మీదకు వెళ్లటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. డీఎస్పీతో పాటు భారీగా పోలీసు బలగాలు వెళ్లి కేశవుని అడ్డుకున్నారు. గ్రామాలకు నీరు విడుదల చేయకపోతే పది వేల మందితో వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా పెద్ద కౌకుంట్ల పంచాయితీ విభజన అంశం రాజకీయ రగడకు దారి తీస్తుంది. వీరిరువురి పోరులో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో తెలుసుకోవాల్సిన అంశంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/payyavula-keshav-vs-vishweshwar-25-89769.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.