పోలవరం ప్రాజెక్టు... నవ్యాంధ్రకు జీవనాడి... ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కావడమే కాకుండా, దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో మూడొంతుల పని పూర్తి చేశారు. ఇక మిగిలింది పావు వంతే. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం తిరకాసు పెట్టడంతో, పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అటు కేంద్రం... ఇటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎన్నిసార్లు అక్షింతలు వేసినాసరే మొండిగా ముందుకెళ్తోన్న జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల విడుదలను నిలిపివేసింది. కేంద్రం నుంచి దాదాపు 4వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, 3వేల కోట్ల రూపాయల విడుదలకు ఫైల్ ముందుకు కదిలింది. అయితే, పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని నివేదిక ఇవ్వడం... మరోవైపు రివర్స్ టెండరింగ్ తో రీటెండర్లు చేపట్టడంతో నిధుల రిలీజ్ కు బ్రేక్ వేసింది. దాంతో ఆ నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని నివేదిక ఇవ్వడంతో, ఆ సంగతేంటో తేలాకే నిధులు రిలీజ్ చేద్దామంటూ కేంద్రం ఫైలును పక్కనబెట్టిందని చెబుతున్నారు. పోలవరం వివాదం తేలేదాక కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశమే లేదంటున్నారు. దాంతో, జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడిందని వెలగపూడి వర్గాల్లో వినబడుతోంది. అంతేకాదు జగన్ ఏకపక్ష విధానాలతో మా కన్ను మేమే పొడుచుకున్నట్లైందని వైసీపీ నేతలు, కొందరు మంత్రులు వాపోతున్నారట. ఇప్పటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సమయంలో ఈ నిధులు వచ్చుంటే కొంత వెసులుబాటు కలిగేందని, కానీ జగన్ అనాలోచిత నిర్ణయాల మూలంగా చిక్కుల్లో పడాల్సి వచ్చిందని అంటున్నారు. ఆర్ధికంగా అత్యంత క్లిష్టపరిస్థితులున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిపోయి... ఇలా కష్టాలను కొని తెచ్చుకోవడమేంటని వ్యాఖ్యానిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-govt-gives-shock-to-ys-jagan-over-polavaram-25-89767.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.