Publish Date:Apr 14, 2025
అటు పాలిటిక్స్లో ఇటు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మరో అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చి సూపర్హిట్ను సొంతం చేసుకుంది డాకు మహారాజ్. కలెక్షన్లతో పాటు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
Publish Date:Apr 14, 2025
శ్రీవారి లడ్డూను తిన్నా కూడా వారు ఆయన భక్తులు అయిపోతారన్న నానుడి ఉంది. అలాంటిది ఆయనకు మొక్కు కోవడం మాత్రమే కాదు తలనీలాలు సమర్పించడం అంటే వారు స్వామివారి పట్ల భక్తి చూపడంలోనే అది పరాకాష్ట. అలాంటి భక్తి చూపడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ప్రస్తుతం వార్తలకెక్కారు.
Publish Date:Apr 14, 2025
సోషల్ మీడియా జమానా వచ్చాక.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయలేని, పలకలేని ఎన్నో పదాలు.. ఇక్కడ యధేచ్ఛ గా స్వైర విహారం చేస్తున్నాయ్. ఇవాళ అందరూ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. కానీ, గతంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్రబాబు విషయంలో తీవ్ర స్థాయిలో వ్యక్తిత్వ హననం చేసిన వారే.
Publish Date:Apr 14, 2025
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం ఇటు పార్టీ నేతలకు, అటు రాజకీయ పండితులకు కూడా చిక్కడం లేదు. చిక్కు ముడి వీడడం లేదు. ఎందుకనో ఏమో కానీ పార్టీ జాతీయఅధ్యక్షు ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం అయితే అంతటా వినిపిస్తోంది.
Publish Date:Apr 14, 2025
అదేమిటో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా..ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్ధ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Apr 14, 2025
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని హత్య చేసి ఉక్రేయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసిన యూస్ యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ట్రంప్ని హత్య చేయడానికి తల్లదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆ 17 ఏళ్ల యువకుడు వారినే హత్య చేయడంతో అసలు కుట్ర వెలుగు చూసింది.
Publish Date:Apr 14, 2025
ఐదు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు.. మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది లోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ, విక్రయాది హక్కుభుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు.
Publish Date:Apr 14, 2025
స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి తన స్థాయిని, తన ప్రతిష్టనూ తనే దిగజార్చుకుంటున్నారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యతే ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటే ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు.
Publish Date:Apr 14, 2025
తిరుమలేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా, వారు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అవసరమైన పలు చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమలేశుని దర్శనం జాప్యం లేకుండా వేగంగా జరిగేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించుకోవడానికి రెడీ అయ్యింది.
Publish Date:Apr 14, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (ఏప్రిల్ 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
Publish Date:Apr 13, 2025
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
Publish Date:Apr 13, 2025
బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
Publish Date:Apr 13, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.