అన్నా లెజినోవా త‌ల నీలాల స‌మ‌ర్ప‌ణ‌

Publish Date:Apr 14, 2025

Advertisement

క్రిష్టియ‌న్ అయినా డిక్లరేషన్ తో పాటు తలనీలాల సమర్పణ

హిందువుల గుండెల్ని దొచుకున్న పవన్ సతీమణి

ఆంధ్రులు ఫిదా.. ఫిదా..

శ్రీవారి ల‌డ్డూను తిన్నా కూడా వారు ఆయ‌న భ‌క్తులు అయిపోతార‌న్న నానుడి ఉంది. అలాంటిది ఆయ‌న‌కు మొక్కు కోవ‌డం మాత్ర‌మే కాదు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌డం అంటే వారు స్వామివారి ప‌ట్ల భ‌క్తి చూప‌డంలోనే అది ప‌రాకాష్ట. అలాంటి భ‌క్తి చూప‌డంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా ప్ర‌స్తుతం వార్త‌ల‌కెక్కారు. అన్నాది ఈ మ‌తం కాదు, ఈ నేల కాదు. కానీ ఇక్క‌డి భ‌క్తి విశ్వాసాల ప‌ట్ల ఆమె అపార‌మైన న‌మ్మ‌కం పెంచుకున్న‌ట్టుగానే చెప్పాలి. 

లేకుంటే త‌న కొడుక్కి సింగ‌పూర్లో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌ట‌మేంటి? ఆమె ఈ ప్ర‌మాదంలోంచి త‌న కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ త్వ‌ర‌లోనే కోలుకోవాల‌ని.. భావించ‌డ‌మేంటి? ఇప్పుడా మొక్కు తాను క్రిష్టియ‌న్ అయి ఉండి  కూడా డిక్లెరేష్ ఇచ్చి మ‌రీ తీర్చుకోవ‌డ‌మేంటి? అన్న‌దిక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిజానికి మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ కి అంత పెద్ద ప్ర‌మాదం ఏం జ‌ర‌గ‌లేదు కానీ, బాలుడితో పాటు ప్ర‌మాదంలో చిక్కిన ఒక బాలిక మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో భ‌య‌ప‌డ్డ అన్నా  లెజినోవా త‌న బంగారు  కొండ‌కు ఏమీ కాకూడ‌దంటూ అచ్చం తెలుగువారిలా.. తెలుగువారి ఆధ్యాత్మిక అదృష్టం- వెంక‌టేశ్వ‌ర స్వామికి ముడుపు క‌ట్టి, స్వామీ నా కొడుకు ఈ ప్ర‌మాదం  నుంచి బ‌య‌ట ప‌డితే, నీకు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకుంటాన‌ని మొక్కుకోవ‌డం మాత్ర‌మే కాక‌.. డిక్ల‌రేష‌న్ సైతం ఇవ్వ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. నువ్వు నీ త‌ల‌నీలాల‌ను ఇవ్వ‌డం కాద‌మ్మా.. మా మ‌న‌సుల‌ను కూడా దోచుకున్నావంటూ ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు.

ఆమె పుట్టుక‌తో క్రిష్టియ‌న్ అయినా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీమ‌ణిగా ఇక్క‌డి స‌నాత‌న ధ‌ర్మంపై విప‌రీత‌మైన ప్రేమాభిమానాలను పెంచుకున్నారు. ఇక్క‌డి భ‌క్తి విశ్వాసాల‌ను అవ‌గ‌తం చేసుకున్నారు. వాటిని అర్ధం చేసుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. ఇదిగో ఇలా ఫాలో అవుతున్నారు కూడా. దీంతో ఇటు అభిమానులే కాదు అటు సామాన్య భ‌క్త జ‌నులు సైతం.. అన్నా లెజినోవాను తెగ  మెచ్చుకుంటున్నారు.

కార‌ణం.. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా జ‌న్మ‌తః క్రిష్టియ‌నే. కానీ, శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు కావాల‌నే డిక్ల‌రేస‌న్ పై సంత‌కం చేయ‌కుండా తెలుగువారిని తీవ్రంగా వేధిస్తుంటారు. పెద్ద పెద్ద ప్ర‌ముఖులే శ్రీవారి చెంత‌కు వ‌చ్చిన‌పుడు తాము హిందూయేత‌రులైన‌పుడు.. విధిగా డిక్ల‌రేష‌న్ ఇస్తారు. అలాంటిది ఒక ముఖ్య‌మంత్రి కొడుకుగా ఉండి, తాను కూడా ఒక ముఖ్య‌మంత్రిగా  ప‌ని చేసిన జ‌గ‌న్ మాత్రం .. అన్నా లెజినోవా అనే విదేశీయురాలికున్న క‌నీస  విచ‌క్ష‌ణా జ్ఞానం కూడా లేద‌న్న మాట వినిపిస్తోంది. 

ఇటీవ‌ల ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి  అన్న‌ట్టు ఇటు శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలపుడు కానీ, అటు ఒంటిమిట్ట కోదండ రామ స్వామి క‌ళ్యాణోత్స‌వం లో కానీ, దుర్గ‌మ్మ స‌న్నిధికి వ‌చ్చిన‌పుడు కానీ.. త‌న స‌తీమ‌ణితో స‌హా హాజ‌రు కాని జ‌గ‌న్ రెడ్డి,, చేసిన సంప్ర‌దాయ విరుద్ధ‌మైన చ‌ర్య‌లు లెక్క‌లేన‌న్ని. 

ఈ మాట వ‌చ్చింద‌ని చెప్పి.. 2024 ఎన్నిక‌ల‌కు ముందు సంక్రాంతి సంద‌ర్భంగా.. ఇంటి ముందు శ్రీవారి సెట్టు వేయించుకుని.. ఆయ‌న్ను అవ‌మానించ‌డం మాత్ర‌మే కాకుండా.. తాము త‌యారు చేయించిన ప్ర‌సాదాన్ని కూడా తీసుకోకుండా దాన్ని నాప్ కిన్ కి తుడిచేసుకుని  జగన్ చేసిన దైవాప‌రాధం అంద‌రికి తెలిసిందే.

అలాంటిది అన్నా లెజినోవా.. మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను ఇంత చ‌క్క‌గా పాటిస్తుంటే అంద‌రికీ ముచ్చటేస్తోంది. జ‌గ‌న్ లా ఆమె సైతం ఒక క్రిష్టియ‌నే అయినా.. భార‌తీయ‌త‌ను మ‌రీ ముఖ్యంగా మ‌న తెలుగు వారి సంప్ర‌దాయాల‌ను.. ప‌ద‌హారాణాల తెలుగింటి ఆడ‌ప‌డుచులాగా పాటించ‌డంతో.. ఆమెపై అంద‌రూ ప్ర‌శంస‌ల వ‌ర్షం  కురిపిస్తున్నారు.

అలాగ‌ని అన్నా లెజినోవా కేవ‌లం పైపై సంప్ర‌దాయాల పాటింపు మాత్ర‌మే కాదు.. జాత‌కాల‌ను చూపించుకోవ‌డం వంటి ఎన్నో సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన‌ ప‌నులు చేయిస్తార‌నీ అంటారు. మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అంటూ త‌న కొడుక్కి హిందూ శ‌బ్ధంతో కూడిన‌ నామ‌క‌ర‌ణం చేయించ‌డం మాత్ర‌మే కాదు.. అత‌డు తండ్రికి మించిన త‌న‌యుడు అవుతాడ‌ని కూడా జాత‌కం కూడా చెప్పించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈ దిశ‌గా ప‌వ‌నోవిచ్ కి సంబంధించిన జాత‌క ఫ‌లితం ఒకటి  నెట్టింట‌ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఏది ఏమైనా అన్నా లెజినోవా కొట్టించుకున్న ఈ గుండు ద్వారా ఇటు తెలుగు వారి గుండెల్ని దోచుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. అటు మాజీ సీఎం జ‌గ‌న్ కి చెంప‌పెట్టులా ఆమె డిక్లెరేష‌న్ మీద సంత‌కం పెట్టి మ‌రీ త‌ల‌నీనాలు స‌మ‌ర్పించుకోవ‌డంతో శ్రీవారి భ‌క్తులు త‌బ్బి ఉబ్బిబ్బి అయిపోతున్నారట‌.  ఎందుకంటే శ్రీవారికి త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ అంటే ఎంతో ఇష్టం. అలాంటి ఇష్టమైన కార్య‌క్ర‌మాన్ని తాను క్రిష్టియ‌న్ అయినా కూడా.. తెలుగు వారి న‌మ్మ‌కాల‌ను విశ్వాసాల‌ను పాటించ‌డంతో ఇక్క‌డి వారిని మ‌రింత‌గా ఆక‌ట్టుకున్నారామె.

By
en-us Political News

  
అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే.
వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది.
తినేమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (ఏప్రిల్ 28) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ లోనే అనుమతిస్తున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ లు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ నేతలు.
తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ శాంతి కుమారి ఈ నెల 30 పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రామకృష్ణారావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకు బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాశారు. రేపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల.. విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సూపర్ స్టార్ బదులిచ్చారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని.. క్రియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన వెహికల్స్ భారీగా వచ్చాయి.
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయ్. రూపాయి రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు… అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. అందులోనూ ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదని ఎంపీ చామల ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.