Publish Date:Oct 11, 2019
స్పెషల్ క్లాసెస్ కి వెళ్ళిన విధ్యార్ధినులతో వెకిలి చేష్టలకు దిగుతున్నాడు ఓ ప్రొఫెసర్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోని నన్నయ్య యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న ఒక అధ్యాపకుడి దాష్టీకం ఇది. మార్కులు కావాలన్నా, ప్రాజెక్ట్ వర్కులు పూర్తి చేయాలన్నా, పి.హెచ్.డి లాంటి ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా నేను చెప్పినట్టు వినాలని చెప్పి విధ్యార్ధినులను లోపరుచుకుంటున్నాడని, యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా డిపార్టుమెంట్ హెడ్ గా పని చేస్తున్న సూర్య రాఘవేంద్ర స్పెషల్ క్లాసులంటూ విద్యార్థినుల్ని తన ఫ్లాట్ కు పిలుస్తున్నాడు అని ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ కు వెళ్లిన తర్వాత లైంగిక వేధింపులకు దిగుతున్నారని విద్యార్ధినులు చెబుతున్నారు. అంతేకాదు చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా సీఎం జగన్ కి లేఖ రాసి బాధిత విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నత విద్యాశాఖ ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ప్రొఫెసర్ రాఘవేంద్ర మాత్రం తాను క్లాసులకు రమ్మని చెప్తే ఆ క్లాసులకు రావటం ఇష్టం లేనివాళ్ళు తనపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం సెలవులు కారణంగా విధ్యార్ధినులు క్యాంపస్ కు రాకపోవటంతో వారు వచ్చిన తరువాత విచారణ చేపట్టి ఆ తరువాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై విధ్యార్ధినుల తల్లి తండ్రులతో పాటు విద్యార్ధి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nannaya-university-professor-sexual-assaults-on-students-25-89954.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!