నరాలు తెగే ఉత్కంఠ, గోళ్లే కాదు.. వేళ్లే కొరికేసుకునేంత టెన్షన్.. ఇదీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు చివరి రోజు పరిస్థితి. చేతిలో నాలుగు వికెట్లు ఉండగా, కేవలం 35 పరుగులు చేస్తే విజయం వరించే స్థితిలో ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేపట్టింది. నాలుగో రోజు ఆట తిలకించిన ఎవరైనా సరే ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అన్న నిర్ణయానికి వచ్చేశారు. కానీ భారత్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన హైదరాబాదీ స్టార్ బౌలర్ ఔను స్టార్ బౌలరే మహమ్మద్ సిరాజ్ టీమ్ ఇండియా విజయమే ఈ టెస్టు ఫలితం అన్న నమ్మకంతో ఉన్నాడు. అదే నమ్మకంతో బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ మాత్రం భారత్ కు అంత సునాయాసంగా చిక్కలేదు. చెమటోడ్పించింది. ఉత్కంఠ రేకెత్తించింది. నిరాశలో ముంచింది. ఆశలు చిగురింప చేసింది. చివరకు విజయం అందింది. అందుకు ముఖ్య కారకుడు నిస్సందేహంగా సిరాజ్ అనడంలో సందేహం లేదు.
అన్నిటికీ మించి ఆదరణ తగ్గిపోతున్నదని అంతా భావిస్తున్న టెస్ట్ క్రికెట్ లోని మజా ఏమిటో ఈ టెస్టు మ్యాచ్ ప్రతి బంతిలోనూ కనిపించేలా చేసింది. టీ20లు టెస్టు క్రికెట్ ముందు బలాదూర్ అని నిరూపించింది. ఆరు పరుగుల ఆధిక్యతతో టీమ్ ఇండియా ఐదో టెస్టును గెలుచుకుని సిరీస్ ను సమంజసం చేసింది ఈ విజయం సిరాజ్ బౌలింగ్ హైలైట్. ఒక సంచలనం. ఈ టెస్ట్ సిరీస్ లోనే సిరాజ్ నిలకడగా వికెట్లు పడగొడుతూ వచ్చాడు. అంతే కాదు మొత్తం 23 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. అంతే కాదు ఇరు జట్లలోనూ కూడా సిరీస్ లోని ఐదు మ్యాచ్ లూ ఆడిన ఏకైక పేసర్ గా కూడా నిలిచాడు. ఫిట్ నెస్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో మబూమ్రా కేవలం మూడు మ్యాచ్ లే ఆడాడు. అలా బూమ్రా లేని రెండు మ్యాచ్ లలో కూడా సిరాజ్ ఇండియన్ బౌలింగ్ బాధ్యతను సమర్థంగా భుజాన మోశాడు.
ఇక మళ్లీ చివరిదైన ఐదో టెస్ట్ వద్దకు వస్తే నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద పట్టి కూడా నియంత్రించుకోలేక బౌండరీ లైన్ టచ్ చేసి గొప్ప అవకాశాన్ని జారవిడిచిన సిరాజ్.. తన ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆ తప్పిదాన్ని అంతా మరిచిపోయేలా చేశాడు ఓటమి అంచు నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
మొత్తంగా ఉత్కంఠ, ఉత్సాహం, కోపం, నిట్టూర్పు ఇలా అన్ని రకాల మానసిక స్థితులను కలిగేలా చేసిన మ్యాచ్ ఇది. టి20, వన్డేలు తీసికట్టేననిపించిన టెస్ట్ మ్యాచ్ ఇది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mohammad-siraj-back-bone-of-indian-bowling-attack-39-203518.html
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.