మళ్లీ మద్యం ధరలకు రెక్కలు?
Publish Date:Sep 21, 2012
Advertisement
రాష్ట్రప్రభుత్వం ఎన్నిసార్లు కళ్లెలు బిగించినా మద్యం ధరలకు మాత్రం రెక్కలు వస్తూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చేతులు కలిపి క్విడ్ప్రోకో ద్వారా ధర మార్చేందుకు రంగం సిద్ధం చేశారని సమాచారం వెల్లడైంది. రాజకీయంలో ఉన్నప్పుడే నాలుగుచేతులా సంపాదించేయాలన్న ప్రతినిధులు ఉబలాటం తాగుబోతుకు అదనపుభారంగా మారనుంది. ఇప్పటికే మద్యంలో కల్తీ ఎక్కువై ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్న తాగుబోతులు మరోసారి అధికధరలకు మద్యం కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ మేరకు చురుకుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ 40శాతం దుకాణాల్లో రహస్యంగా రేట్లు పెరిగాయి. ప్రభుత్వం కొత్తగా ఎక్సయిజ్పాలసీ తీసుకువచ్చి నష్టాలను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడితే ప్రతినిధులు, అధికారులు మాత్రం వాటాలు వేసుకుని రేట్లు పెంచేయటం పట్ల తాగుబోతులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల్లో లొసుగులను పాతపాలసీలోని యజమానులు ఉపయోగించుకున్నారని చెప్పటానికి కొత్తగా పెరిగిన ధరలే నిదర్శనంగా చూపవచ్చు.
ఇప్పటికే క్విడ్ప్రోకో ద్వారా వందల కోట్ల రూపాయలు పంచుకున్నారని విశ్వసనీయంగా తేలింది. తాజాగా ఎపీబీసిఎల్ తయారు చేసే ఉత్పత్తుల ధరలను పెంచాలని ఒత్తిడి కూడా వస్తోంది. మద్యంతయారీదార్లయిన 7డిస్టలరీల యజమానులు 12శాతం ధర పెంచి ఉత్పత్తిని సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మిగిలిన 28 చిన్న డిస్టలరీలను కూడా ఓ ప్రభుత్వసలహాదారు స్వయంగా బెదిరించారని సమాచారం. ప్రభుత్వపెద్దలకు, తయారీదార్లకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే ఈ ధరలు పెరిగాయని మాత్రం పరిశీలనలో తేలింది. లేకపోతే 400శాతం ఎక్సయిజ్డ్యూటీ పెరగటానికి అవకాశమే లేదని కూడా స్పష్టమైంది. ఏమైనా కొత్తగా రంగంలో నిలిచిన డిస్టలరీలు మార్కెట్టును శాసిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని డిస్టలరీలు తమ ఉత్పాదన అమ్మకాలు పెంచుకునేందుకు వ్యాపారులకు డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఇలా డిస్కౌంట్లు ప్రకటించటం నేరమైనా ఆ కంపెనీలు దాన్ని పట్టించుకోవటం లేదు. అలానే వేరే కంపెనీ ఖాళీబాటిల్స్ సేకరించి తమ మద్యంతో నింపుతూ అక్రమవ్యాపారానికి కూడా కంపెనీలు తెరలేపుతున్నాయి. మద్యం వ్యాపారంలో జరుగుతున్న అక్రమాలు గురించి తెలిసినా తాగుబోతులు అలవాటును మానుకోలేక కొనసాగుతున్నారని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ధరలు పెరుగుతున్న విషయం తెలిసినా పాలకులు దీన్ని పట్టించుకోకపోవటం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది.
http://www.teluguone.com/news/content/liquor-price--24-17542.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





