ఉపన్యాసాలు కాదు...
Publish Date:Sep 21, 2012
Advertisement
మనిషి మనుగడకు భాష ప్రధానం. భాష దానికి సంబంధించిన వ్యక్తుల భావాలకు మార్గం చూపిస్తుంది. అందుకే ప్రపంచంలోని ప్రతివారు తమ తమ భాషల ప్రాముఖ్యతకోసం ప్రాకులాడతారు. ఆధునీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న తెలుగుభాష ప్రాముఖ్యతను గుర్తించి, భాష, సాంస్కృతిక రంగాల్లో విస్తరించాల్సిన అవసరం ఉన్నదని 22 యేళ్ళ తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని చెబుతూ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎం.పిలు, ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సి.లతో జూబ్లీహాల్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బావుంది.. చాలా బావుంది. ఈ ఉత్సాహం ఎప్పటివరకు... ఆ కార్యక్రమాలు అయిపోయేవరకే.. తర్వాత.. మామూలే. నిజమండీ. మాతృభాషను దిగువస్థాయినుండి అమలుచేస్తేనే అది పటిష్టంగా ఉంటుంది. కనీసం ఆ దిశగానైనా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. తెలుగులో మాట్లాడితే ఏమి రానివాడ్ని చూసినట్లు చూస్తున్నారు మన రాష్ట్రంలోనే. అంతెందుకు రాష్ట్రంలోని పలు విద్యాలయాల్లోనే తెలుగులో మాట్లాడితే పిల్లలను దండిరచిన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, విద్యాలయాలు, యూనివర్శిటీలు ఇలా ప్రతిచోట తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణలు వంటివి ఖచ్చితంగా కొనసాగాలి. అలా లేకుంటే ఆయా వాటిని దండిరచాలి. మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా. లేదంటే... అంతరించుపోతున్న భాషగా చెప్పుకుంటున్న తెలుగుభాష భవిష్యత్లో అంతరించిపోయిన, లిపిలేని భాషగా మిగిలిపోతుంది. ఇప్పటికే అమ్మ, నాన్న స్థానంలో మమ్మీ, డాడీలు వచ్చేశాయి. ఉపన్యాసాలు కాదు... అధికారంగలవారిగా భాషకోసం ఆచరణ ముఖ్యం.
http://www.teluguone.com/news/content/telugu-basha-24-17543.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





