నాయకులంటే... ఆవేశమేనా?
Publish Date:Sep 20, 2012
Advertisement
అసెంబ్లీలో నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఒకరికొకరు ఎన్నెన్ని మాటలనుకున్నా ఫరవాలేదు. కోపంతో తిట్టుకున్నా బాధలేదు... కానీ వారి ఆవేశం అసెంబ్లీలోని బల్లలు, మైకులపై చూపిస్తేనే ఇబ్బంది. అసెంబ్లీలో తెలంగాణాపై అన్ని పార్టీలు తమ వైఖరులు చెబుతున్న నేపథ్యంలో స్పీకర్ లోక్సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్కు మైక్ ఇవ్వడం.. ఆయన బంద్లవల్ల సరైన ట్రాన్స్పోర్ట్ లేక ప్రతిరోజూ 60మంది ఉద్యోగులను ఐబిఎం కంపెనీ విమానంలోబెంగుళూరు తీసుకెళుతోందని చెప్పారు. దాంతో పక్కనేఉన్న టిఆర్ఎస్ ఎం.ఎల్.ఎ. హరీష్రావు లేచి ‘తెలంగాణాలో వందలాదిమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. దాన్ని కాదని ఐబిఎం కంపెనీ ఉద్యోగులను విమానంలో తీసుకెళ్ళిన విషయం ఇక్కడెందుకు?’ అంటూ మండి పడ్డారు. దానిపై వాగ్వివాదం జరగటంతో హరీష్ కోపంతో మైక్ను రెండుసార్లు బెంచీకేసి కొట్టారు. మరో సందర్భంలో నాగం, దానం మధ్య జరిగిన వాగ్వివాదంలో మైక్ను చేతిలోకి తీసుకుని వైర్ను చేతికి చుట్టేసుకున్నారు దానం. అంతేకాదు తన చేతిలోని సిడీని సైతం నాగంపై విసిరేందుకు ప్రయత్నించారు. ప్రజాసమస్యలపై సామరస్య, ప్రశాంతంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించవలసింది పోయి భావితరానికి అసెంబ్లీ అంటే ఇలా చెయ్యాలేమో అన్నట్లుగా ఉంటున్నాయి గౌరవనీయులైన మన నేతల తీరు! ఇలా అసెంబ్లీ మైక్లు, బల్లలు పాడుచేస్తే.. వాటి స్థానంలో కొత్తవి పెట్టడానికి ఆయ్యే ఖర్చు ఎవరూ భరిస్తారు.? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల సొమ్మే! ఎమ్మెల్యేల దుందుడుకుతనానికి ప్రజల సొమ్ము ఖర్చుచేయడం ఎంతవరకూ న్యాయం? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాకాకుండా అసెంబ్లీలో ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో.. వారినుండే దానికయ్యే ఖర్చును వసూలు చెయ్యాలని సూచన కూడా చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/fight-in-assembly-24-17512.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





