Publish Date:Jun 13, 2025
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని.. తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు విచారణకు సహకరిస్తానంటూనే సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేశారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానన్న కేటీఆర్, పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. ఈ పరీక్షలను టీవీల్లో లైవ్గా చూపిద్దాం. లై డిటెక్టర్ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా..? రాష్ట్రం దివాళా తీసిందంటూనే పదేపదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు..? ప్రజాధనం వృథా ఎందుకు..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.
లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. సీఎం సిద్ధమా?
ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా-ఈ కేసులో ఈనెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ‘‘బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతా. పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే యత్నం ఇది. ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. టీవీల్లో లైవ్గా చూపిద్దాం. లైడిటెక్టర్ పరీక్షలు చూసి ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా? పదే పదే విచారణలతో ప్రజాధనం వృథా ఎందుకు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-39-199875.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.