జగన్ గుంటూరు ర్యాలీ.. అంబటి కోసమా?.. అలజడి కోసమా?

Publish Date:Feb 3, 2026

Advertisement

గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి గెస్ట్ ఆర్టిస్ట్ గా మాత్రమే వచ్చి వెడుతున్నారు. గత ఎన్నికలలో వైసీపీ పరాయం తరువాత నుంచీ ఏపీకి వచ్చి వెడుతున్న జగన్ షెడ్యూల్ ను గమనిస్తే ఆయన  వారంలో మూడు రోజులు మాత్రమే ఏపీకి కేటాయిస్తున్నారు. ఆ మూడు రోజులలోరెండు ఆయన బెంగళూరు నుంచి రాక, పోకకు తీసేస్తే నికరంగా ఆయన రాష్ట్రంలో ఉంటున్నది కేవలం ఒక్క రోజు మాత్రమే. అంటే ఆయన బుధవారం ఏపీలోకి అడుగుపెట్టి.. గురువారం మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు తిరుగు ప్రయాణం అవుతున్నారు. విపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పరాజయం పాలైన తరువాత ఆయన షెడ్యూల్ దాదాపుగా ఇలాగే ఉంది.  
ఈ సారి కూడా ఆయన బుధవారం ఏపీకి వస్తున్నారు. అయితే ఈ సారి ఆయన రాకకు ఒక ప్రాధాన్యత ఉంది. అదే బూతుపురాణం కారణంగా అంబటి అరెస్టు. ముఖ్యమంత్రిపై  అనుచిత వ్యాఖ్య లు, దుర్భాషల కారణంగా అంబటి అరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు ముందు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు గుంటూరులోని ఆయన నివాసంపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 4) అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ పరామర్శకు కూడా భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. వాస్తవానికి ఆయన పరామర్శించాల్సింది (అసలా అవసరం లేదు. ఎందుకంటే అంబటి అరెస్టైంది ఏదో ప్రజా సమస్యపై ఆందోళన చేసి కాదు. సీఎంపై అసభ్య, సభ్య సమాజం ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని బూతులతో విరుచుకుపడినందుకు) రాజమహేంద్రవరంలో ఉన్న అంబటి రాంబాబును. కానీ జగన్ మాత్రం గుంటూరు లో ర్యాలీ చేసి అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిం చనున్నారు. 

అసలు అంబటి రాంబాబు అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మూడు రోజులు అయ్యింది. ఆయన నివాసంపై దాడి జరిగి నాలుగు రోజులు. నిజంగా అంబటి నివాసంపై దాడి, అంబటి అరెస్టుపై జగన్ నిజంగా ఆగ్రహం చెందారంటే.. దాడి జరిగిన రోజునే బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చి ఉండాలి.

కానీ ఆయన షెడ్యూల్ లో ఎటువంటి మార్పూ లేదు. యధావిధిగా ఆయన బుధవారం (ఫిబ్రవరి 4)నే బెంగళూరు ప్యాలెస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. అయితే ఈ సారి తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా మీట్ తో సరిపెట్టకుండా, గుంటూరులో ర్యాలీ చేయనున్నారు. అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.  ఈ సారి ర్యాలీ సందర్భంగా కూడా భారీ జనసమీకరణ, శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం లాంటి వ్యూహాలు వైసీపీయులు చేసే ఉంటారన్న అంచనాతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.