జగన్ గుంటూరు ర్యాలీ.. అంబటి కోసమా?.. అలజడి కోసమా?

Publish Date:Feb 3, 2026

Advertisement

గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి గెస్ట్ ఆర్టిస్ట్ గా మాత్రమే వచ్చి వెడుతున్నారు. గత ఎన్నికలలో వైసీపీ పరాయం తరువాత నుంచీ ఏపీకి వచ్చి వెడుతున్న జగన్ షెడ్యూల్ ను గమనిస్తే ఆయన  వారంలో మూడు రోజులు మాత్రమే ఏపీకి కేటాయిస్తున్నారు. ఆ మూడు రోజులలోరెండు ఆయన బెంగళూరు నుంచి రాక, పోకకు తీసేస్తే నికరంగా ఆయన రాష్ట్రంలో ఉంటున్నది కేవలం ఒక్క రోజు మాత్రమే. అంటే ఆయన బుధవారం ఏపీలోకి అడుగుపెట్టి.. గురువారం మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు తిరుగు ప్రయాణం అవుతున్నారు. విపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పరాజయం పాలైన తరువాత ఆయన షెడ్యూల్ దాదాపుగా ఇలాగే ఉంది.  
ఈ సారి కూడా ఆయన బుధవారం ఏపీకి వస్తున్నారు. అయితే ఈ సారి ఆయన రాకకు ఒక ప్రాధాన్యత ఉంది. అదే బూతుపురాణం కారణంగా అంబటి అరెస్టు. ముఖ్యమంత్రిపై  అనుచిత వ్యాఖ్య లు, దుర్భాషల కారణంగా అంబటి అరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు ముందు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు గుంటూరులోని ఆయన నివాసంపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 4) అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ పరామర్శకు కూడా భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. వాస్తవానికి ఆయన పరామర్శించాల్సింది (అసలా అవసరం లేదు. ఎందుకంటే అంబటి అరెస్టైంది ఏదో ప్రజా సమస్యపై ఆందోళన చేసి కాదు. సీఎంపై అసభ్య, సభ్య సమాజం ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని బూతులతో విరుచుకుపడినందుకు) రాజమహేంద్రవరంలో ఉన్న అంబటి రాంబాబును. కానీ జగన్ మాత్రం గుంటూరు లో ర్యాలీ చేసి అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిం చనున్నారు. 

అసలు అంబటి రాంబాబు అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మూడు రోజులు అయ్యింది. ఆయన నివాసంపై దాడి జరిగి నాలుగు రోజులు. నిజంగా అంబటి నివాసంపై దాడి, అంబటి అరెస్టుపై జగన్ నిజంగా ఆగ్రహం చెందారంటే.. దాడి జరిగిన రోజునే బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చి ఉండాలి.

కానీ ఆయన షెడ్యూల్ లో ఎటువంటి మార్పూ లేదు. యధావిధిగా ఆయన బుధవారం (ఫిబ్రవరి 4)నే బెంగళూరు ప్యాలెస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. అయితే ఈ సారి తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా మీట్ తో సరిపెట్టకుండా, గుంటూరులో ర్యాలీ చేయనున్నారు. అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.  ఈ సారి ర్యాలీ సందర్భంగా కూడా భారీ జనసమీకరణ, శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం లాంటి వ్యూహాలు వైసీపీయులు చేసే ఉంటారన్న అంచనాతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

By
en-us Political News

  
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
బడి పిల్లలను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.