Publish Date:Sep 25, 2025
జగన్ డిజిటల్ బుక్ తెరవడంతో ఆయనకు ఏదీ స్వయంగా తయారు చేయడం రాదని క్రిస్టల్ క్లియర్ గా అర్ధమై పోయింది. ఆయన పెద్ద సంక్షేమ రూపశిల్పి కూడా ఏమీ కాదు. గతంలో తన తండ్రి ప్రవేశ పెట్టిన వాటికే కాస్త సొబగులు అద్దారాయన. అది కూడా ఏమంత ఒరిజినల్ కాదు. ఇదంతా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రండ్. ఇప్పుడు చూస్తే జగన్ తన వెల్ఫేర్ ఇతరత్రా పథకాల సోర్స్ మొత్తం లోకేషే అనడంలో ఎలాంటి అనుమానమే లేదు..
ఔను నిజమే.. మీరు చదువుతున్నది నిజం. జగన్ కి కొత్త ఆలోచన ఏదీ రాదు. ఒకప్పుడు లోకేష్ కార్యకర్తలకు జీతాలు అనే కాన్సెప్ట్ నే తర్వాత జగన్ మక్కీకి మక్కీ కాపీ కొట్టి దాన్ని వాలంటీర్లుగా మార్చారు. కావాలంటే చూడండి.. ఆయన అపాయింట్ చేసిన చాలా మంది వాలంటీర్లలో అత్యధిక శాతం మంది రెడ్లే కనిపిస్తారు. ఇప్పుడు వాళ్లకు కూడా మొండి చేయి ఇచ్చారు. అదే లోకేష్ ఒక వైసీపీ కార్యకర్తను కూడా ఆదుకుంటూ.. ఆయన ఆరోగ్య ఖర్చులు మొత్తం తాము భరిస్తామన్న భరోసా ఇచ్చారు. మానవత్వం చాటుకున్నారు. తర్వాత డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్. ఇవి స్టాన్ ఫర్డ్ లో చదివి, వరల్డ్ బ్యాంక్ లో పని చేసిన అనుభవజ్ఞుడైన లోకేష్ బ్రైన్ చైల్డ్. ఈ కాన్సెప్ట్ ద్వారానే జగన్ చాలా వరకూ నేరుగా జనం ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. లోకేష్ కూడా ఇదంతా నాది అన్న కోణంలో ఏదీ చెప్పుకోరు.
ఇప్పుడు చూస్తే రెడ్ బుక్. మాములుగా ఒక మాట అంటుంటారు. నువ్వు చేసిన పనిని ఇతరులు కాపీ కొడితే నువ్వొక ట్రెండ్ సెట్టర్ అని. ఎగ్జాట్ గా లోకేష్ కూడా అంతే. ట్రెండ్ ఫాలో కాడాయన- సెట్ చేస్తారని అంటారు చాలా మంది. మీరు కావాలంటే చూడండి.. లోకేష్ రెడ్ బుక్ ఎంత ఫేమస్ అంటే, పొరుగు రాష్ట్రం నుంచి కవిత కూడా తాము పింక్ బుక్ రాస్తామని అన్నారు. ఇక జగన్ అయితే ఓడిపోయిన తొలి నాళ్లలోనే తాము బ్లూ బుక్ రాస్తామన్నారు.
ఇప్పుడు చూస్తే బ్లూ అంటే తనను కాపీ క్యాట్ అంటారని భావించారేమో.. దాన్ని డిజిటల్ బుక్ గా మార్చారు. కానీ కాపీ కాపీ కాకుండా పోతుందా? జగన్ ఏదీ ఒరిజినల్ కాదు. అంతా డూపే అన్న ముద్ర పడే తీరుతుందని అంటున్నారు చాలా మంది వైసీపీ వర్గాల వారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-copy-paste-story-39-206853.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.