Publish Date:Sep 25, 2025
జగన్ చిన్నపిల్లాడో లేక, తానొచ్చిన ఫ్యాక్షన్ కుటుంబమే అలాంటిదో తెలీదు కానీ.. , ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. అందుకు నిబంధనలు, పాటింపులేం ఉండక్కర్లేదు. ఏదైనా అంతే.. తిరుమల డిక్లరేసన్ నుంచి మొదలు పెడితే.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వరకూ సరిగ్గా ఇలాగే కనిపిస్తుంది జగన్ వ్యవహారశైలి. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జగన్ కి ఆ హోదా ఇవ్వడానికి తనకు రూల్స్ బుక్ లో ఎలాంటి క్లాజు కనిపించడం లేదన్నారాయన. అయితే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఢిల్లీకి సంబంధించి ఒక ఉదాహరణ గుర్తు చేశారు. అప్పట్లో అంటే 2015 ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసిందీ.. ఆ టైంలో బీజేపీకి వచ్చింది కేవలం మూడు సీట్లే.. కానీ ఢిల్లీ స్పీకర్.. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తాను ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించారన్న వార్త తెరపైకి తెచ్చారు.
ఇదిలా ఉంటే మరో వార్త ఏంటంటే.. తాము సభలోకి వస్తాము. కానీ మాట్లాడ్డానికి కావల్సినంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు జగన్ అని. రాకుండానే టైం ఇవ్వరన్న గ్యారంటీ ఏంటి? వస్తే కదా తెలిసేది? ఇదెలా ఉందంటే జగన్ టెన్త్ తప్పిన పిల్లలు ఆ కాసిన్ని మార్కులేసి మమ్మల్ని పాస్ చేసేయవచ్చు కదా? అని అడిగినట్టుందని అంటారు కొందరు. ఇంకా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే కొందరు చెప్పేదాన్నిబట్టి చూస్తే అసలు జగన్ కి ఉన్న ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయేలా ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 190(4) ప్రకారం.. అరవై రోజుల పాటు వరుసగా ఎవరైనా సభ్యుడు రాకుంటే.. ఆ సీటు ఖాళీగా ప్రకటించవచ్చు.
ఇప్పుడు జగన్ కు ముందు గొయ్య- వెనక నుయ్యగా ఉందట పరిస్థితి. ఎంత మాత్రం ఆయన హ్యాపీగా లేరు. ఒక సమయంలో జగన్ తన ఎమ్మెల్యే సీటుకు రిజైన్ చేసీ ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. అలాగైనా తనకీ తలవంపులు తప్పుతాయన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మిగిలిన వారి చేత కూడా రిజైన్ చేయించి.. ఉప ఎన్నికలకు పోవాలన్నది జగన్ ఎత్తుగడ. మరి వారిలో అందరూ ఓడిపోతే పరిస్థితేంటన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఎందుకంటే అ చివరికి పులివెందులలో తన స్థానంలో పోటీ చేసే అవినాష్ కూడా ఓడిపోతే.. తర్వాత జగన్ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కాగలదన్న మాట వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-moves-creat-fear-in-ycp-39-206857.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.