సమాజ నిర్మాణంలో మహిళల పాత్రే కీలకం : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 8, 2026

Advertisement

 

అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తెలుగు మహిళలు ఏ పని తలపెట్టిన లక్ష్యాన్ని సాధించే వరకు వదిపెట్టరని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు సమాజం నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. 

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్‌ అని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక విశ్వవిద్యాలయం తెచ్చారని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికే లక్ష దాటారు. తీసుకున్న రుణాలను సమయానికి బ్యాంకులకు చెల్లిస్తున్నారు. 

అప్పులు ఇప్పించే బాధ్యత తనదని సద్వినియోగం చేసుకోవాల్సింది మీరేనని ముఖ్యమంత్రి అన్నారు. మీరు తయారు చేసి వస్తువులు మీరే వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో  మరో 5లక్షల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో స్వయం బ్రాండ్ ఉత్పత్తులే వాడాలి అని చంద్రబాబు తెలిపారు.

డ్వాక్రా, మెప్మాలో ప్రస్తుతం 1.1 కోట్ల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులు దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. తమ ఇంట్లో కూడా ఇద్దరు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, తన భార్య, కోడలు సమర్థంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలని సూచించారు.

ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దుర్మార్గులను అరికట్టాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు. మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఆరోగ్యం విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఎవరికీ వ్యాధులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మహిళలదేనని పేర్కొన్నారు.

సమాజంలో వస్తున్న మార్పుల వల్ల జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గితే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. పెద్ద కుటుంబం ఉంటే రక్షణ, భద్రత, ఆనందం కలుగుతాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు పెద్ద కుటుంబాలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం 58 శాతం మంది ఒక్క బిడ్డకే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు.


 

By
en-us Political News

  
కడప నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేపాల్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి.
నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీ అన్న పుస్తకంలో అసలు ఏముంది?
భారత తలసరి ఆదాయం ఇప్పటికీ చైనా తలసరి ఆదాయంలో ఐదో వంతు మాత్రమే కావడంతో ఉత్పాదకత పెరుగుదలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వృద్ధికి కావలసినంత స్పేస్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక పురోగతి మరింత వేగం పుంజుకోవడానికి ఇండియాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొన్న ట్రంప్.. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో మెట్రో రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.