ఎవరికి ఏ స్థానాలు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడ్డ గులాబీ వర్గ నేతలు....

Publish Date:Oct 16, 2019

Advertisement

 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిస్థితి మందెక్కువయితే మజ్జిగ పల్చన అన్న సామెతను తలపిస్తోంది. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూకుడు ప్రదర్శించింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. తొలుత గ్రామ, ఆ తర్వాత మండల, పట్టణ కమిటీలను ఎన్నుకొంది. ఇక మిగిలింది మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్ ల కమిటీలే అయితే మండల కమిటీల ఎన్నికలు పూర్తయి నెల గడిచినా మునిసిపల్ కమిటీలను మాత్రం ప్రకటించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలు సాహసించటం లేదు.

ఒక్కో పదవికి పదిమందికీ తక్కువ కాకుండా ఆశావహులు పోటీగా ఉండడం మెజారిటీ కార్యకర్తలు తమకు కీలక పదవులు కావాలని ఒత్తిడి తెస్తుండడంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజారిటీ మున్సిపాల్టీల్లో కనీసం వార్డు కమిటీలను కూడా అధికారికంగా ప్రకటించలేదు పరిస్థితి ఏర్పడినట్లు గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చాలాయేళ్ళపాటు సంస్థాగత ఎన్నికల లేవు.

ఉద్యమం తొలి దశలో ఉన్నప్పుడు పార్టీ పదవులు తీసుకొనేందుకు చాలా చోట్ల కార్యకర్తలే దొరకలేదు. కాలక్రమేణ ఉద్యమం ఊపందుకోవడం టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగడంతో పార్టీ పదవులకు పోటీ ఏర్పడుతూ వస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోటీ మరింత తీవ్రంగా మారింది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు మధ్య మధ్యలో ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కారు పార్టీలో ఓవర్ లోడ్ అయిందట దీంతో ఎవరెవరికి ఏ ఏ సమీకరణాలతో పదవులివ్వాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొందనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్ పల్లి, నస్పూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలున్నాయి.

వీటిలో కొన్నింట టీఆర్ఎస్ వార్డు కమిటీలను పూర్తి చేశారు. మెజారిటీ మునిసిపాలిటీల్లో వార్డు సమన్వయ కమిటీలు, పట్టణ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆశావహులు అందరినీ ఆ కమిటీల్లో సభ్యులుగా చేశారు. కానీ వార్డు మున్సిపల్ అధ్యక్షులను మాత్రం అధికారికంగా ఖరారు చేయడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ చార్జిలను ఆశావహుల్లో ఎవరడిగినా నీకే ఇస్తామని వారు చెబుతున్నారని సమాచారం.

బెల్లంపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం అయిదారుగురు పోటీలో ఉన్నారు. వీళ్లంతా ఎమ్మెల్యే చిన్నయ్య వెంటపడుతున్నారు. అందరూ కావాల్సినవారే కావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట ఇతర మున్సిపాలిటీల్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.ఇక ఎవరెవరికి ఏ స్థానాలు ఇస్తారో వేచి చూడాలి.  

By
en-us Political News

  
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.