అధికారి టేబుల్పై బాదం పప్పులు చల్లిన బాధితుడు!
Publish Date:Apr 20, 2026
Advertisement
ఛత్తీస్గఢ్లో వినూత్న నిరసన: ఫైల్ క్లియరెన్స్ కోసం అధికారిణికి 'బాదం' బహుమతి! ఫైల్ గుర్తులేదన్న అధికారి.. బాదం పప్పులతో 'జ్ఞాపకశక్తి' పాఠం చెప్పిన బాధితుడు. నెలల తరబడి తిరిగినా పట్టించుకోలేదని.. అధికారి టేబుల్పై బాదం పప్పులు చల్లి నిరసన.. బిలాస్పూర్లోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ఇంటికి సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కోసం ఓ వ్యక్తి గత కొన్ని నెలలుగా ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు విన్నవించినా, అధికారుల నుంచి మాత్రం నామమాత్రపు సమాధానాలే తప్ప, పనిలో పురోగతి కనిపించలేదు. సదరు బాధితుడు ఫైల్ గురించి అడిగిన ప్రతిసారీ, సంబంధిత అధికారిణి నుంచి "నాకు ఫైల్ గుర్తులేదు.. చూస్తాను" అనే సమాధానమే వచ్చేది. నెలల తరబడి ఇదే తంతు కొనసాగడంతో బాధితుడి సహనం నశించింది. తన పని ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అయోమయంలో ఉన్న ఆయన, అధికారులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే బాధితుడు కార్యాలయానికి వెళ్ళి మరోసారి తన ఫైల్ గురించి ఆరా తీశాడు. అధికారిణి ఎప్పటిలాగే ఏమీ తెలియదన్నట్లుగా సమాధానం ఇచ్చింది. వెంటనే అతను తన వెంట తెచ్చుకున్న బాదం పప్పులను టేబుల్ మీద పారబోశాడు. "ఈ బాదం పప్పులు తినండి.. అప్పుడు మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, నా ఫైల్ కూడా మీకు గుర్తుకొస్తుంది" అంటూ ఘాటుగా స్పందించి అక్కడి నుంచి నిష్క్రమించాడు. ప్రభుత్వ వ్యవస్థలో నిర్లక్ష్యం ఎంతలా వేళ్లూనుకుపోయిందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకపోతే ఇలాంటి నిరసనలు తప్పవని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారిణి టేబుల్పై బాదం పప్పులు చల్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, ఈ వినూత్న నిరసనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, సదరు వ్యక్తి ఫైల్ క్లియర్ అవుతుందో లేదో చూడాలి. ప్రజాసేవలో ఉండాల్సిన వారు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. https://x.com/ChotaNewsApp/status/2045427648470642774
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పని జరగకపోయినా, అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకపోయినా బాధితులు పడే వేదన వర్ణనాతీతం. ఇలాంటి ఓ విచిత్రమైన, అదే సమయంలో అందరినీ ఆలోచింపజేసే ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో వెలుగుచూసింది.
http://www.teluguone.com/news/content/innovative-protest-in-chhattisgarh-36-217821.html





