అజామాబాద్ భూమి కేటాయింపు రద్దు చేయాలి.. హరీశ్రావు డిమాండ్..!
Publish Date:Aug 30, 2026
Advertisement
రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా..? హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్, అజామాబాద్లో తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆధీనంలో ఉన్న సుమారు 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన ఆదివారం సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.500 కోట్ల విలువైన ఈ భూమిని కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేటు వ్యక్తికి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ఫెడ్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ సంస్థను కాదని ప్రైవేటు వ్యక్తికి భూమిని అప్పగించడానికి గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ సంస్థలా వ్యవహరిస్తోందని హరీశ్రావు విమర్శించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేటు సంస్థకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ప్రభుత్వ హక్కును నిర్ధారించిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆ తీర్పును పట్టించుకోకుండా భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రైవేటు శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడామని హరీశ్రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పేదలపై ఒత్తిడి పెంచుతూ.. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అప్పగిస్తోందని విమర్శించారు. సామాన్యుల ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటుకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. అజామాబాద్ భూముల వ్యవహారం ఒక్కటే కాదని.. కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తోందని హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ పోతే.. భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం గుడి, బడి, చివరకు శ్మశానానికి కూడా ప్రభుత్వ భూమి మిగలదని వ్యాఖ్యానించారు. అజామాబాద్ భూమికి సంబంధించిన కేటాయింపును తక్షణమే రద్దు చేసి.. భూమిని ఆయిల్ఫెడ్కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Harish Rao, CM Revanth Reddy, Telangana Government, BRS, Ajampabad Land, Azamabad Land, Oilfed Land, Hyderabad Land, Hyderabad Government Land, Government Land, Land Allocation, Private Land Allocation
http://www.teluguone.com/news/content/harish-rao-24-230263.html





