రెండున్నర లక్షల దొంగ పింఛన్లు.. వైసీపీ హయాంలో ఇదో జగన్మాయ!

Publish Date:Jul 3, 2024

Advertisement

వైసీపీ హయాంలో కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా సాగింది. జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలలో దోపిడీ పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది.  జగన్ ఓటమి తరువాత అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మల సంక్షేమం కోసం తాను కోట్లు వెచ్చించాననీ, ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లన్నీ ఎక్కడకు పోయాయి. ఏదో కుట్ర ఉంది.. కానీ ఆధారాలు లేవు, ఏం చేయలేం అంటే నిర్వేదంగా మాట్లాడారు.

కానీ జగన్ చెబుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారుల కంటే.. అనర్హులైన అస్మదీయులకే సింహభాగం అందాయని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.   సంక్షేమం పేరిగ జగన్ జలగలు యథేచ్ఛగా నొక్కేశాయని ఇప్పుడు బయట పడుతోంది. సంక్షేమం పేరిట జగన్ సర్కార్ అందించిన పింఛన్లూ పక్కదారి పట్టాయని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్  హయాంలో లబ్ధిదారులకు కోత పెట్టి మరీ దాదాపు రెండు లక్షల 50 వేల దొంగ పింఛన్లు  పంపిణీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

రాష్ట్రంలో కొలువుదీరిన తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం ఈ దొంగ పింఛన్ల వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్రంలో అనేక మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా జగన్ సర్కార్ తప్పుడు మార్గాల ద్వారా సొంత వారికి పెద్ద ఎత్తున ఈ సామాజిక పింఛన్లు అందించిందని తెలియవచ్చింది.

ఆధార్ కార్డులో వయస్సు మార్చుకుని, దొంగ వికలాంగ సర్టిఫికెట్లతో అలాగే వితంగా, ఒంటరి మహిళ పింఛన్లను లక్షల మంది అక్రమంగా, అర్హత లేకపోయినా అందుకున్నారని. వీరికి పింఛన్లు అందజేయడం కోసం అర్హలకు కోత పెట్టారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనర్హులకు కాకుండా అర్హులకే పింఛన్లు అందేలా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమౌతోంది. ఈ విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. దొంగ పింఛన్ల విషయంలో బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.  మండల స్థాయినుంచీ ప్రక్షాళన జరగాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు.
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్‌ని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
బిఆర్ఎస్ నేతలు  కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను  పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ  అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది.
జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు.
వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. నెల రోజులు దాటినప్పటికీ ఇంత వరకు భారీ వర్షాలు లేవు. కానీ  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం  నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. 
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్  అయిన   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.