జి.హెచ్.యం.సి. పరిధిలో 27,12,468 ఓట్లు రద్దు?

Publish Date:Sep 19, 2015

Advertisement

 

పెరిగిన జనాభాకి అనుగుణంగా వార్డుల పునర్విభజన చేయడం కోసమే జి.హెచ్.యం.సి. ఎన్నికలు వాయిదా వేశామని తెలంగాణా ప్రభుత్వం పదేపదే చెపుతోంది. కానీ అది చేస్తున్న పని మాత్రం జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం. అది ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లో ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన కూకట్ పల్లి సర్కిల్ లోనే ఏకంగా 1,21,085ఓట్లను తొలగించారు. ఆ తరువాత ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిల్స్ లో అత్యధికంగా ఓట్లను తొలగించారు.

 

తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిరసనలు చేపట్టి దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పిర్యాదు చేసాయి. తెలంగాణా ప్రభుత్వం సుమారు 17 లక్షల ఓట్లు తొలగిస్తోందని అవి పిర్యాదు చేసాయి. కానీ మొత్తం 27,12,468 ఓట్లను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల జాబితాలో రెండు చోట్ల పేరున్నవారు, అధికారులు వచ్చినప్పుడు ఇంటికి తాళాలు వేసున్నవారివి, చిరునామా మారినవారివి తదితర కారణాలతో ఓట్లను తొలగిస్తున్నారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకే అనర్హులుగా భావించినవారి పేర్లను తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ అన్నారు. అర్హులయినవారు స్థానికంగా ఉంటున్నట్లు ఆధారాలు చూపిస్తే మళ్ళీ వారి పేర్లను జాబితాలో చేర్చుతామని చెప్పారు.

 

ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. కనుక తక్షణమే ఆధార్-ఓటర్ కార్డుల లింక్ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ జి.హెచ్.యం.సి. పరిధిలో మాత్రం స్థానికంగా ఉంటున్నట్లు ఆధారాలు చూపించలేకపోతే ఓటర్ల జాబితాలో నుండి పేర్లను తొలగిస్తున్నామని జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమశేఖర్ చెప్పడం విశేషం. బోగస్ ఓటర్లను ఏరివేయడం అత్యవసరమే. కానీ ఆ పేరుతో జి.హెచ్.యం.సి. పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడం అన్యాయమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంలో వెనకడుగువేసే ఆలోచనలో లేదు. చివరికి ఈ వ్యవహారం కూడా హైకోర్టుకో సుప్రీం కోర్టుకో చేరుతుందేమో.

By
en-us Political News

  
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.