Publish Date:Jun 25, 2026
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రతిష్ఠను మసకబార్చిన ఎన్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని స్వయంగా బిల్ గేట్స్ వెల్లడించడం విశేషం. లైంగిక నేరాలతో ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైన జెఫ్రీ ఎప్స్టీన్తో తనకున్న సంబంధాలపై , బిల్ గేట్స్ తొలి సారి బాహాటంగా చెప్పారు. అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ ఎదుట ఈ నెల 10న జరిగిన రహస్య విచారణలో బిల్ గేట్స్ వాంగ్మూలం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన వ్యక్తిగత జీవితంలోని బలహీనతలను, రహస్యాలను అడ్డం పెట్టుకుని జెఫ్రీ ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేసినట్టు బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగానే.. గేట్స్ తన వ్యక్తిగత జీవితంలో ముగ్గురు మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయని అంగీకరించాడు.
ఈ ఎఫైర్లు.. తన వివాహం తరువాత కూడా కొనసాగించినట్లు అంగీకరించాడు. రష్యాకు చెందిన ప్రముఖ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరిమా నిగ్మటులినాతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయాలన్నీ ఎప్స్టీన్కు తెలుసని చెప్పిన బిల్ గేట్స్.. వీరిద్దరితో పాటు మెడికల్ ఆంట్రప్రెన్యూర్ ఆలిస్ జాకబ్స్ నెస్సెల్రోడ్ట్తో కూడా తనకు ఎఫైర్ నడిచిందని అంగీరించాడు. ఈ ముగ్గురు మహిళలతో ఉన్న సంబంధాల గురించిన గుట్టును ఆయుధంగా మార్చుకుని.. తనను ఎన్ స్టీన్ బ్లాక్ మెయిల్ చేశాడన్న సంచలన నిజాలను బిల్ గేట్స్ తన వాంగ్మూలంలో చెప్పారు. తన వ్యక్తిగత రహస్యాలు వెల్లడి అవ్వడంతో తన కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో బాధపడ్డారన్న బిల్ గేట్స్..
తన వివాహేతర సంబంధాల సమాచారానికి కొన్ని ఘోరమైన అబద్ధాలను కూడా తోడు చేసి, తనను భయపెట్టి, మళ్లీ తనతో వ్యాపార, వ్యక్తిగత సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఎప్స్టీన్ ప్రయత్నించాడని బిల్ గేట్స్ ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇందుకు సాక్ష్యంగా 2013 నాటి ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ను గేట్స్ ఉదహరించారు. ఆ ఈమెయిల్లో గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలతో పాటు ఆయన మాజీ ఉద్యోగి బోరిస్ నికోలిక్ ప్రస్తావన కూడా ఉంది. నిజాలు, అబద్ధాలను కలిపి తనను బ్లాక్మెయిల్ చేయడానికి ఎప్స్టీన్ ఆ మెయిల్ను సిద్ధం చేశాడని గేట్స్ వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/epstein-blackmailed-bill-gates-36-224066.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.