నాలుగో టి20లోనూ టీమ్ ఇండియా ఘోర పరాజయం.. సిరీస్ ఇంగ్లాండ్ కైవసం.!

Publish Date:Jul 9, 2026

Advertisement

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టి20ల సిరీస్ లో టీమ్ ఇండియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా,  తరువాత మూడు మ్యాచ్ లలోనూ టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది.  బ్రిస్టల్‌ వేదికగా గురువారం (జులై 9) జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో   ఇంగ్లాండ్ జట్టు భారత్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇఖ నాలుగో టి20 విషయానికి వస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ టీమ్ ఇండియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి   9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సిరీస్ లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.   బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నా  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్   49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి మిగిలిన బ్యాటర్ల నుంచి ఎటువంటి సహకారం లభించకపోవడంతో టీమ్ ఇండియా  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  158 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్  20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, జోష్ టంగ్ కూడా 2 వికెట్లు తీశాడు. 

ఇక 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌  13.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఊదేశింది.  కెప్టెన్ హ్యారీ బ్రూక్  35 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి తోడుగా ఫిల్ సాల్ట్  42 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు  151 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశారు.  

Shreyas Iyer lone battle, India vs England T20, Team India loses series, Harry Brook

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీతో పాటు ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల లేటెస్ట్ బంగారం ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ పన్నిన సరికొత్త కుట్రను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు బయటపెట్టాయి. అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ సంచలన ఇంటెలిజెన్స్ నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మరియు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూపిన అద్భుతమైన ప్రతిఘటన, ఐఎంఎఫ్ IMF , ఐఈఏ IEA , వరల్డ్ బ్యాంక్ అంచనాలపై సమగ్ర విశ్లేషణ.
జూలై 15, 2026 నుండి అమల్లోకి రానున్న భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA . బ్రిటన్ లగ్జరీ కార్లపై 110% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ ఐదేళ్లలో 10 శాతానికి తగ్గింపు. రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సెమాగ్లుటైడ్ Semaglutide డ్రగ్ సరఫరా నిలిపివేతతో సిస్టమాటిక్స్ బ్రోకరేజ్ దీని రేటింగ్‌ను తగ్గించింది. రూ.64 కోట్ల విలువైన మార్కెట్ క్యాప్ కోల్పోయిన ఈ స్టాక్‌ను ఇప్పుడు ఇన్వెస్టర్లు కొనాలా, హోల్డ్ చేయాలా అనే పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
లేజర్ పవర్ అండ్ ఇన్‌ఫ్రా ఐపీఓ రెండో రోజుకు చేరింది. గ్రే మార్కెట్‌లో ₹24 ప్రీమియంతో దూసుకుపోతున్న ఈ షేరు వివరాలు, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ మరియు బ్రోకరేజ్ రేటింగ్‌లు ఇక్కడ చూడండి.
తెలంగాణ ప్రభుత్వం నేడు రైతు భరోసా ఆఖరి విడత నిధులను విడుదల చేయనుంది. ఖమ్మం జిల్లాలో జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2 0 తేడాతో ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. కిలియన్ ఎంబాప్పే అద్భుత గోల్‌తో సరికొత్త రికార్డులు సృష్టించి ఫ్రాన్స్‌ను వరుసగా మూడోసారి సెమీఫైనల్‌కు చేర్చాడు. ఆ వివరాలు మీకోసం.
ఇంగ్లాండ్ చేతిలో నాలుగో టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలై సిరీస్ కోల్పోయింది. మ్యాచ్ అనంతరం యువ ఆటగాళ్ల తప్పులపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన ఎమోషనల్ కామెంట్స్, పిచ్ విశ్లేషణ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో భారత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా 13, 14 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో అతని బలహీనతలపై ఇంగ్లాండ్ దిగ్గజాలు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ చేసిన సంచలన విశ్లేషణను ఇక్కడ చదవండి.
ఈ ముఠా కదలికలపై ముందే నిఘా ఉంచిన గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వాహనాలను చూసిన గ్యాంగ్‌స్టర్లు లొంగిపోవడానికి బదులుగా, తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై   కాల్పులు జరిపారు.
గతంలో.. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నాణ్యతలో దేశంలో దారుణంగా 19వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ తాజా నివేదిక ప్రకారం 2వ స్థానానికి ఎగబాకి కొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 19వ స్థానం నుండి రెండో స్థానానికి చేరడం ఒక అద్భుత విజయంగా.. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిత్యం వందలాది మంది కార్మికులు పని చేసే ఆ బహుళ అంతస్తుల ఫ్యాక్టరీ భవనంలో.. గురువారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎం జరుగుతోందో అర్థమయ్యేలోగానే 28 మంది కార్మికులు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు. పలువురు గాయపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.