Publish Date:Mar 16, 2025
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా? పోరాడి ఓడిపోవడం కంటే ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా? సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి?
Publish Date:Mar 16, 2025
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే.. వారిని ప్రశ్నించడం వరకు పరిమితం కావాలని, కానీ, వారి ఇంట్లో ఆడవాళ్లు ఏం తప్పులు చేశారని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని నిలదీశారు.
Publish Date:Mar 16, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (మార్చి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Mar 15, 2025
గుంటూరు మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. 2021లో మేయర్గా ఎన్నికైన మనోహర్ మరో ఏడాది పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. గత నెలలో జరిగిన గుంటూరు నగరపాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు కైవసం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
Publish Date:Mar 15, 2025
ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్వర్క్ లేవు, పోల్ మేనేజ్మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.
Publish Date:Mar 15, 2025
హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది.
Publish Date:Mar 15, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Publish Date:Mar 15, 2025
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు? అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది? అంటే స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Publish Date:Mar 15, 2025
మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
Publish Date:Mar 15, 2025
వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు.
Publish Date:Mar 15, 2025
పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను కట్టేసిన ఓ తండ్రి తలలను బకెట్లో ముంచి చంపేసాడు. తర్వాత తానూ ఊరివేసుకుని చనిపోయాడు. కాకినాడ జిల్లా వాకల పూడిలో అసిస్టెంట్ అకౌంట్ గా పని చేస్తున్న వానపల్లి చంద్రకిషోర్ ఒకటో తరగతి చదువుతున్న జోషిల్ , యుకేజీ చదువుతున్న నిఖిల్ పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడు
Publish Date:Mar 15, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Publish Date:Mar 15, 2025
హోలి ముసుగులో హైదరాబాద్ ధూల్ పేటలో గంజాయి విక్రయాలు జరిగినట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టి ఎఫ్ ) పోలీసులు గుర్తించారు. మండే ఎండలను ఎన్ క్యాష్ చేసుకోవడానికి వ్యాపారులు ఐస్ క్రీం విక్రయాలు జరపడం సబబే. కానీ ఈ ఐఎస్ క్రీంలలో గంజాయి కలిపి విక్రయించడం ధూల్ పేటలో వెలుగు చూసింది. ఐస్ క్రీంలలో నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్ టిఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు