నీరుగారిపోతున్న ఎన్నికల ఉల్లంఘన కేసులు?
Publish Date:May 24, 2012
Advertisement
ఎన్నికల్లో నేరాలు, నిబంధనలు అతిక్రమించిన నేరానికి ఇప్పటివరకూ ఎటువంటి కఠినశిక్ష నిందుతులకు పడ్డ దాఖలాలు లేవు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ ఉప ఎన్నికల్లో నేరాల కింద పోలీసులు ఫైల్ చేసిన కేసుకు తక్కువే. కానీ, ఆ కేసులు ప్రముఖులపై పెట్టడం ఎన్నికల అధికారుల చట్టబద్ధమైన కర్తవ్యంలా కనిపిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పార్టీల కేంద్రకమితీలు, అధికారంలో ఉన్న పార్టీ సూచనల మేరకు ఈ కేసులు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా కొట్టివేతకు గురవుతాయని గత అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల కమీషన్ తన పదును పెంచి మరీ కులప్రస్తావన చేసే అభ్యర్థులనూ వదలబోమని హెచ్చరించింది. ఈ హెచ్చరిక జారీ చేయటానికి మునుపే దీనికి ఓ స్థాయి కల్పించేలా మంత్రి ధర్మాన ప్రసాదరావు తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా క్రిష్టియనేనని చేసిన వ్యాఖ్యను రికార్డుచేయమని శ్రీకాకుళం కలెక్టరును ఆదేశించింది. అలానే జగన్ రోడ్డుషోలో మద్యం పంపిణీని కూడా ఓటరును ప్రలోభపెట్టే అంశంగా కేసు నమోదు చేయించింది. గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై అనుమతి లేని ప్రచారం కేసు నమోదైంది. ఇదే విధంగా మొట్టమొదట తిరుపతిలో టెలికాం ఉద్యోగుల సహకారం కోరిన దేశం అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి, మాజీ మంత్రి చింతామోహన్ టిటిడి పాలకమండలి కార్యాలయ ఉద్యోగులను అభ్యర్తించటం కూడా ఎన్నికల కమీషన్ రికార్డు చేసింది. తాజాగా టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు చంద్రశేఖరరావు పరకాలలో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలను కూడా ఎన్నికల కమీషన్ రికార్డు చేయించింది. ఇలా ప్రముఖులందరూ ఎన్నికల నిబంధనావళి అతిక్రమణ నేరాల్లో చిక్కుకున్నారు. వీరందరికీ ఈ కేసుల్లో శిక్షపడుతుందా? అన్న ప్రశ్న సామాన్య ఓటరు నుంచి ఎదురవుతోంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న స్పీడుగా ఎన్నికల కమీషన్ శిక్షలు వేయించగలిగితే ఎన్నికల అక్రమాలు కొంతవరకైనా తగ్గవచ్చు. అయితే డబ్బుతో ప్రలోభ పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ అడిరి పోతోందని లెక్కలే చెబుతున్నాయి. భారతదేశ జనాభాతో సమానమైన కోట్లాది రూపాయలు చెక్ పోస్టుల తనిఖీల ద్వారా రావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఇంకా దగ్గరపడకుండానే ఇప్పటికే 25కోట్ల రూపాయల వరకూ లెక్కల్లో లేని సొమ్ము ఆదాయపన్ను శాఖకు పోలీసుల ద్వారా చేరింది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళమండలం ఏలూరుపాడు చెక్ పోస్టు తనిఖీలో బ్యాంకుదని చెబుతూ లేక్కచూపని రూ. 2.35 కోట్లు ఇదే బాపతు కింద పోలీసులు స్వాధీనం చేసుకుని ఆదాయపన్నుశాఖకు అప్పగించారు. ఈ కేసులు బలంగా పెట్టినా అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భయపడతారని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/election-rules-cases-24-14269.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





