ఇక్కడ ఇలా.. అక్కడ అలా..!..

Publish Date:Jun 4, 2022

Advertisement

ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. పర్యవశానాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో అయితే అది మరింత ఎక్కువ కావాలి. ఘనంగా ప్రకటనలు చేసేయడం.. ఆచరణలోకి వచ్చే సరికి జావగారిపోవడం వల్ల ప్రజలలో పలుచన అవుతారు. అలా కాకుండా నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి చెప్పింది చెప్పనట్లు చేయగలితే ప్రజలలో గౌరవం పెరుగుతుంది.

వారి నాయకత్వం పట్ల విశ్వాసం కలుగుతుంది. చెప్పింది చేయను.. చేసేది చెప్పను అన్నట్లు వ్యవహరించే వారు కొందరైతే.. చెప్పింది చెప్పినట్లు చేసి జనం మన్ననలు పొందేవారు మరి కొందరు. ఇందులో మొదటి రకం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే.. రెండో రకం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ముందుగా జగన్ విషయమే తీసుకుంటే.. 2019లో అధికారం చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన వెంటనే జగన్ రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ ను పూర్తిగా మార్చేస్తాననీ, కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించేశారు. అంటే తొలి రెండున్నరేళ్లు తన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న వారెవరూ రెండున్నరేళ్ల తరువాత ఉండరనీ, వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రులుగా కొత్త వారికి అవకాశం ఇస్తాననీ ప్రకటించారు.

అప్పట్లో జగన్ నిర్ణయాన్ని అందరూ శ్లాఘించారు. సాహసోపేత నిర్ణయంగా కీర్తించారు. అలా చేయడం వల్ల మంత్రుల పనితీరే కాకుండా, ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవపై దృష్టి పెడతారని భావించారు. రెండున్నరేళ్లు కాదు.. మూడేళ్లు గడిచిన తరువాత జగన్ చేసింది మంత్రివర్గ  మార్పు కాదు.. పునర్వ్యవస్థీకరణ మాత్రమే. అంటే కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మరికొందరికి స్థానం కల్పించారు. మొత్తం కేబినెట్ ను మారుస్తానంటూ నాడు చేసిన ప్రకటనను పూర్తిగా మర్చిపోయారు. ఆ మార్పులు కూడా  భయం భయంగా ఎవరిని తొలగిస్తే ఏం సమస్య వస్తుందో అన్నట్లు కసరత్తుల మీద కసరత్తులు, ఒకసారి ఒకరిని అనుకుని కాదు కాదు అంటూ మరొకరి పేరు...ఇలా అంతా గందరగోళం. చివరికి పునర్వ్యవస్థీకరణ చేసినా.. పార్టీలో అసమ్మతి, అసంతృప్తి. నిరసన ప్రదర్శనలు మొత్తం మీద కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పూర్తయిన నెలల తరువాత కూడా ఇప్పటికీ పార్టీలో అసమ్మతి చల్లారలేదు. మూడేళ్ల ముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా తడబాటు. అన్ ప్రిపేర్డ్ నెస్.. ఎవరిని కదిపితే ఏమౌతుందోనన్న భయం. దీంతో జగన్ కేబినెట్ రీషఫుల్ తరువాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. అసమ్మతి రాగాలు శ్రుతి మించాయి. నిరసనలు పరిధి దాటాయి.

నెలలు గడుస్తున్నా కొత్త మంత్రులు పూర్తిగా కుదురుకోలేదు. జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతోనే ఆ పార్టీ బలహీనతలూ బయటపడ్డాయి. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురై మాజీ లైన వారు సైలెంటైపోయారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన దాఖలాలూ కనిపించడం లేదు. మంత్రులుగా నిత్యం విపక్షంపై విమర్శలతో చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు మౌనం దాల్చారు. పార్టీ కార్యక్రమాలలోనూ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయానికి వస్తే ఆయన 2004 నుంచి ఒడిశా సీఎంగా ఉన్నారు. వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీని విజయ పథంలో నడిపించారు. 2014 ఎన్నికలలో విజయం తరువాత మూడేళ్ల వరకూ కేబినెట్ లో ఎటువంటి మార్పూలూ చేర్పులూ లేవు. ఇప్పడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఉపక్రమించారు. అంతే సీఎంకు సంఘీభావంగా, పునర్వ్యవస్థీకరణకు ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనువుగా స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది.

ఈ రోజు అంటే ఆదివారం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. సీఎం కొత్త కేబినెట్ ఏర్పాటు కోసం ప్రస్తుతం ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేశారు. అదీ పార్టీపై పట్టు ఉండటమంటే. ఆయనేం మూడేళ్ల తరువాత మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తానని 2019లో కేబినెట్ ఏర్పాటు సమయంలో చెప్పలేదు. కానీ ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని తలపెట్టగానే మంత్రులందా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు.   స్పీకర్ సహా మంతులంతా   తమ రాజీనామాలను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించారు. ఒడిశా శాసనసభ స్పీకర్ సూర్య నారాయణ్ పాత్రో తొలుత తన రాజీనామాను సమర్పించారు. అనంతరం మంత్రులంతా రాజీనామా చేశారు. పార్టీలో కానీ, మంత్రులలో కానీ ఎక్కడా, ఎవరిలోనూ అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం అయిన దాఖలాలు లేవు. అదీ ఒడిశా సీఎం పట్నాయక్ కు, ఏపీ సీఎం జగన్ కూ  తేడా. స్ఫష్టత, విశ్వాసం, విశ్వసనీయతా నవీన్ పట్నాయక్ బ్రాండ్ అయితే.. అస్పష్టత, అయోమయం జగన్ బ్రాండ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.