టెన్త్ పరీక్షల నిర్వహణే కాదు.. ఫలితాల ప్రకటనలోనూ జగన్ సర్కార్ ఫెయిల్

Publish Date:Jun 4, 2022

Advertisement

జగన్ మూడేళ్ల పాలన అంతా తప్పులు చేయడం.. వాటిని సవరించుకోవడంతోనే సరిపోయింది. మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఆఖరికి ఫలితాల ప్రకటన వరకూ అన్నీ తొందరపాటు నిర్ణయాలే.. ఆ తరువాత కోర్టులు అక్షింతలు వేయడం వల్లో.. మంత్రుల జోక్యం వల్లో మళ్లీ నిర్ణయాలు మార్చుకోవడం జగన్ పాలన అంతా ఇదే తంతుగా సాగింది.సాగుతోంది. తాజాగా శనివారం టెన్త్ ఫలితాల ప్రకటన విషయంలో కూడా అదే జరిగింది. పరీక్షలు పూర్తయిన పాతిక రోజుల్లోనే ఫలితాలను ప్రకటించేస్తున్నామని విద్యాశాఖ ఘనంగా ప్రకటనలు ఇచ్చేసింది.

ఈ హడావుడిలో టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ, అది కూడా వైసీపీ వాట్సాప్ గ్రూపులలోనే ప్రశ్నాపత్రాలు వెలుగులోనికి రావడం, లీకేజీకి బాధ్యుడంటూ మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేసి హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీలో కోర్టులో ప్రవేశ పెట్టడం కోర్టు నారాయణకు బెయిలు ఇవ్వడం వంటివన్నీ జనం మరచిపోతారని వైసీపీ భావించింది.  తీరా ఇప్పుడో ఇహనో పరీక్షా ఫలితాలు వెలువడుతాయని విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటే ఫలితాల విడుదల వాయిదా అంటూ విద్యాశాఖ అధికారులు ప్రకటించారురు. విద్యార్థులు నిరాశపడ్డారు.

ఇంతకీ ఫలితాల విడుదల వాయిదాకు కారణమేమిటంటే విద్యాశాఖ మంత్రిగారికి కోపం రావడమేనట. సాధారణంగా టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేస్తారు. కానీ ఏపీలో ఈసారి అధికారులు అత్యుత్సాహంతో మంత్రిగారికి ఫలితాల విడుదల గురించిన సమాచారమే అందించలేదట. విద్యాశాఖాధికారే ఫలితాల విడుదలకు రెడీ అయిపోయారట. చివరి నిముషంలో విషయం తెలిసిన మంత్రి బొత్స అగ్గిమీద గుగ్గిలం అయిపో్యి సదరు విద్యాశాఖాధికారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫలితాల విడుదల వాయిదా పడిందట.

ఇక సోమవారం ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేస్తారని అంటున్నారు. జూన్ 4 అంటే శనివారం ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో  విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోయి ఫలితాల కోసం టెన్షన్ తో ఎదురు చూశారు. చివరి నిముషంలో వాయిదా ప్రకటన రావడంతో అందరూ డీలా పడిపోయారు.  మొత్తానికి జగన్ సర్కార్ పరీక్షల నిర్వహణే అంటే నిర్వహించిన పరీక్షల ఫలితాల విడుదలలోనూ అపహాస్యం పాలైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప

రీక్షా ఫలితాల విషయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించే సర్కార్ ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నామంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫలితాల ప్రకటిస్తున్నామంటూ ఊరించి చివరి నిముషంలో వాయిదా వేయడంతో పరీక్షలు రాసిన పిల్లల వారి తల్లిదండ్రులూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా ఫలితాలను ప్రకటించడానికి అధికారులు సిద్ధపడ్డారంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

 ఏది ఏమైనా టెన్త పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకూ అన్ని విషయాలలోనూ జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలయ్యిందని లోకేష్ విమర్శించారు. ఇక టెన్త్ ఫలితా విడుదల ప్రహసనంలో బొత్స కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని దక్కించుకున్నా ప్రమోషన్ ఆశించిన బొత్సకు డిమోషన్ దక్కడంతో ఆయన లోలోన రగిలిపోతున్నారని అంటున్నారు. ఆ కారణంగానే విద్యాశాఖ విషయాలను అసలు పట్టించుకోవడం లేదనీ, ఆ కారణంగానే అధికారులు ఆయనతో సంప్రదించకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండానే టెన్త్ ఫలితాల ప్రకటన చేసేశారనీ, చివరి నిముషంలో బొత్స రంగ ప్రవేశం చేసి అధికారులపై కోపంతో చిందులు వేసి ఫలితాల విడుదలను వాయిదా వేశారనీ విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మంత్రిగారికి కూడా సమాచారం ఇవ్వకుండా ఫలితాల విడుదల ముహూర్తాన్ని అధికారులు తమంత తాముగా నిర్ణయించి ఉంటారా అన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు లేదనే చెబుతున్నారు. అధికారులు అలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సాహసం చేయరనీ, ఈ నిర్ణయం వెనుక జగన్ అనుమతో, ప్రోత్సాహమో కచ్చితంగా ఉండి ఉంటుందనీ అంటున్నారు. విద్యాశాఖ విషయాలలో మంత్రి బొత్స పట్టించుకోవడం లేదని జగన్ కు స్పష్టమైన సమాచారం అందిన నేపథ్యంలోనే బొత్స విషయం మరచి పోయి మీరు పని కానిచ్చేయండి ప్రోత్సహించడంతోనే అధికారులు ఫలితాల ప్రకటనను ముహూర్తం నిర్ణయించి ప్రకటించేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద టెన్త్ ఫలితాల  విడుదల, వాయిదాల ప్రహసనంతో పార్టీలో, కేబినెట్ లో ఆఖరికి తన మంత్రివర్గ సహచరులలో కూడా బొత్స ప్రతిష్ట, పరపతి క్షీణించాయని అర్ధమౌతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.