టెన్త్ పరీక్షల నిర్వహణే కాదు.. ఫలితాల ప్రకటనలోనూ జగన్ సర్కార్ ఫెయిల్

Publish Date:Jun 4, 2022

Advertisement

జగన్ మూడేళ్ల పాలన అంతా తప్పులు చేయడం.. వాటిని సవరించుకోవడంతోనే సరిపోయింది. మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఆఖరికి ఫలితాల ప్రకటన వరకూ అన్నీ తొందరపాటు నిర్ణయాలే.. ఆ తరువాత కోర్టులు అక్షింతలు వేయడం వల్లో.. మంత్రుల జోక్యం వల్లో మళ్లీ నిర్ణయాలు మార్చుకోవడం జగన్ పాలన అంతా ఇదే తంతుగా సాగింది.సాగుతోంది. తాజాగా శనివారం టెన్త్ ఫలితాల ప్రకటన విషయంలో కూడా అదే జరిగింది. పరీక్షలు పూర్తయిన పాతిక రోజుల్లోనే ఫలితాలను ప్రకటించేస్తున్నామని విద్యాశాఖ ఘనంగా ప్రకటనలు ఇచ్చేసింది.

ఈ హడావుడిలో టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ, అది కూడా వైసీపీ వాట్సాప్ గ్రూపులలోనే ప్రశ్నాపత్రాలు వెలుగులోనికి రావడం, లీకేజీకి బాధ్యుడంటూ మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేసి హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీలో కోర్టులో ప్రవేశ పెట్టడం కోర్టు నారాయణకు బెయిలు ఇవ్వడం వంటివన్నీ జనం మరచిపోతారని వైసీపీ భావించింది.  తీరా ఇప్పుడో ఇహనో పరీక్షా ఫలితాలు వెలువడుతాయని విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటే ఫలితాల విడుదల వాయిదా అంటూ విద్యాశాఖ అధికారులు ప్రకటించారురు. విద్యార్థులు నిరాశపడ్డారు.

ఇంతకీ ఫలితాల విడుదల వాయిదాకు కారణమేమిటంటే విద్యాశాఖ మంత్రిగారికి కోపం రావడమేనట. సాధారణంగా టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేస్తారు. కానీ ఏపీలో ఈసారి అధికారులు అత్యుత్సాహంతో మంత్రిగారికి ఫలితాల విడుదల గురించిన సమాచారమే అందించలేదట. విద్యాశాఖాధికారే ఫలితాల విడుదలకు రెడీ అయిపోయారట. చివరి నిముషంలో విషయం తెలిసిన మంత్రి బొత్స అగ్గిమీద గుగ్గిలం అయిపో్యి సదరు విద్యాశాఖాధికారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫలితాల విడుదల వాయిదా పడిందట.

ఇక సోమవారం ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేస్తారని అంటున్నారు. జూన్ 4 అంటే శనివారం ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో  విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోయి ఫలితాల కోసం టెన్షన్ తో ఎదురు చూశారు. చివరి నిముషంలో వాయిదా ప్రకటన రావడంతో అందరూ డీలా పడిపోయారు.  మొత్తానికి జగన్ సర్కార్ పరీక్షల నిర్వహణే అంటే నిర్వహించిన పరీక్షల ఫలితాల విడుదలలోనూ అపహాస్యం పాలైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప

రీక్షా ఫలితాల విషయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించే సర్కార్ ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నామంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫలితాల ప్రకటిస్తున్నామంటూ ఊరించి చివరి నిముషంలో వాయిదా వేయడంతో పరీక్షలు రాసిన పిల్లల వారి తల్లిదండ్రులూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా ఫలితాలను ప్రకటించడానికి అధికారులు సిద్ధపడ్డారంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

 ఏది ఏమైనా టెన్త పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకూ అన్ని విషయాలలోనూ జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలయ్యిందని లోకేష్ విమర్శించారు. ఇక టెన్త్ ఫలితా విడుదల ప్రహసనంలో బొత్స కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని దక్కించుకున్నా ప్రమోషన్ ఆశించిన బొత్సకు డిమోషన్ దక్కడంతో ఆయన లోలోన రగిలిపోతున్నారని అంటున్నారు. ఆ కారణంగానే విద్యాశాఖ విషయాలను అసలు పట్టించుకోవడం లేదనీ, ఆ కారణంగానే అధికారులు ఆయనతో సంప్రదించకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండానే టెన్త్ ఫలితాల ప్రకటన చేసేశారనీ, చివరి నిముషంలో బొత్స రంగ ప్రవేశం చేసి అధికారులపై కోపంతో చిందులు వేసి ఫలితాల విడుదలను వాయిదా వేశారనీ విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మంత్రిగారికి కూడా సమాచారం ఇవ్వకుండా ఫలితాల విడుదల ముహూర్తాన్ని అధికారులు తమంత తాముగా నిర్ణయించి ఉంటారా అన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు లేదనే చెబుతున్నారు. అధికారులు అలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సాహసం చేయరనీ, ఈ నిర్ణయం వెనుక జగన్ అనుమతో, ప్రోత్సాహమో కచ్చితంగా ఉండి ఉంటుందనీ అంటున్నారు. విద్యాశాఖ విషయాలలో మంత్రి బొత్స పట్టించుకోవడం లేదని జగన్ కు స్పష్టమైన సమాచారం అందిన నేపథ్యంలోనే బొత్స విషయం మరచి పోయి మీరు పని కానిచ్చేయండి ప్రోత్సహించడంతోనే అధికారులు ఫలితాల ప్రకటనను ముహూర్తం నిర్ణయించి ప్రకటించేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద టెన్త్ ఫలితాల  విడుదల, వాయిదాల ప్రహసనంతో పార్టీలో, కేబినెట్ లో ఆఖరికి తన మంత్రివర్గ సహచరులలో కూడా బొత్స ప్రతిష్ట, పరపతి క్షీణించాయని అర్ధమౌతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.