టెన్త్ పరీక్షల నిర్వహణే కాదు.. ఫలితాల ప్రకటనలోనూ జగన్ సర్కార్ ఫెయిల్

Publish Date:Jun 4, 2022

Advertisement

జగన్ మూడేళ్ల పాలన అంతా తప్పులు చేయడం.. వాటిని సవరించుకోవడంతోనే సరిపోయింది. మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఆఖరికి ఫలితాల ప్రకటన వరకూ అన్నీ తొందరపాటు నిర్ణయాలే.. ఆ తరువాత కోర్టులు అక్షింతలు వేయడం వల్లో.. మంత్రుల జోక్యం వల్లో మళ్లీ నిర్ణయాలు మార్చుకోవడం జగన్ పాలన అంతా ఇదే తంతుగా సాగింది.సాగుతోంది. తాజాగా శనివారం టెన్త్ ఫలితాల ప్రకటన విషయంలో కూడా అదే జరిగింది. పరీక్షలు పూర్తయిన పాతిక రోజుల్లోనే ఫలితాలను ప్రకటించేస్తున్నామని విద్యాశాఖ ఘనంగా ప్రకటనలు ఇచ్చేసింది.

ఈ హడావుడిలో టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ, అది కూడా వైసీపీ వాట్సాప్ గ్రూపులలోనే ప్రశ్నాపత్రాలు వెలుగులోనికి రావడం, లీకేజీకి బాధ్యుడంటూ మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేసి హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీలో కోర్టులో ప్రవేశ పెట్టడం కోర్టు నారాయణకు బెయిలు ఇవ్వడం వంటివన్నీ జనం మరచిపోతారని వైసీపీ భావించింది.  తీరా ఇప్పుడో ఇహనో పరీక్షా ఫలితాలు వెలువడుతాయని విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటే ఫలితాల విడుదల వాయిదా అంటూ విద్యాశాఖ అధికారులు ప్రకటించారురు. విద్యార్థులు నిరాశపడ్డారు.

ఇంతకీ ఫలితాల విడుదల వాయిదాకు కారణమేమిటంటే విద్యాశాఖ మంత్రిగారికి కోపం రావడమేనట. సాధారణంగా టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేస్తారు. కానీ ఏపీలో ఈసారి అధికారులు అత్యుత్సాహంతో మంత్రిగారికి ఫలితాల విడుదల గురించిన సమాచారమే అందించలేదట. విద్యాశాఖాధికారే ఫలితాల విడుదలకు రెడీ అయిపోయారట. చివరి నిముషంలో విషయం తెలిసిన మంత్రి బొత్స అగ్గిమీద గుగ్గిలం అయిపో్యి సదరు విద్యాశాఖాధికారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫలితాల విడుదల వాయిదా పడిందట.

ఇక సోమవారం ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేస్తారని అంటున్నారు. జూన్ 4 అంటే శనివారం ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో  విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోయి ఫలితాల కోసం టెన్షన్ తో ఎదురు చూశారు. చివరి నిముషంలో వాయిదా ప్రకటన రావడంతో అందరూ డీలా పడిపోయారు.  మొత్తానికి జగన్ సర్కార్ పరీక్షల నిర్వహణే అంటే నిర్వహించిన పరీక్షల ఫలితాల విడుదలలోనూ అపహాస్యం పాలైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప

రీక్షా ఫలితాల విషయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించే సర్కార్ ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నామంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఫలితాల ప్రకటిస్తున్నామంటూ ఊరించి చివరి నిముషంలో వాయిదా వేయడంతో పరీక్షలు రాసిన పిల్లల వారి తల్లిదండ్రులూ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా ఫలితాలను ప్రకటించడానికి అధికారులు సిద్ధపడ్డారంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

 ఏది ఏమైనా టెన్త పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకూ అన్ని విషయాలలోనూ జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలయ్యిందని లోకేష్ విమర్శించారు. ఇక టెన్త్ ఫలితా విడుదల ప్రహసనంలో బొత్స కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని దక్కించుకున్నా ప్రమోషన్ ఆశించిన బొత్సకు డిమోషన్ దక్కడంతో ఆయన లోలోన రగిలిపోతున్నారని అంటున్నారు. ఆ కారణంగానే విద్యాశాఖ విషయాలను అసలు పట్టించుకోవడం లేదనీ, ఆ కారణంగానే అధికారులు ఆయనతో సంప్రదించకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండానే టెన్త్ ఫలితాల ప్రకటన చేసేశారనీ, చివరి నిముషంలో బొత్స రంగ ప్రవేశం చేసి అధికారులపై కోపంతో చిందులు వేసి ఫలితాల విడుదలను వాయిదా వేశారనీ విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మంత్రిగారికి కూడా సమాచారం ఇవ్వకుండా ఫలితాల విడుదల ముహూర్తాన్ని అధికారులు తమంత తాముగా నిర్ణయించి ఉంటారా అన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు లేదనే చెబుతున్నారు. అధికారులు అలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సాహసం చేయరనీ, ఈ నిర్ణయం వెనుక జగన్ అనుమతో, ప్రోత్సాహమో కచ్చితంగా ఉండి ఉంటుందనీ అంటున్నారు. విద్యాశాఖ విషయాలలో మంత్రి బొత్స పట్టించుకోవడం లేదని జగన్ కు స్పష్టమైన సమాచారం అందిన నేపథ్యంలోనే బొత్స విషయం మరచి పోయి మీరు పని కానిచ్చేయండి ప్రోత్సహించడంతోనే అధికారులు ఫలితాల ప్రకటనను ముహూర్తం నిర్ణయించి ప్రకటించేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద టెన్త్ ఫలితాల  విడుదల, వాయిదాల ప్రహసనంతో పార్టీలో, కేబినెట్ లో ఆఖరికి తన మంత్రివర్గ సహచరులలో కూడా బొత్స ప్రతిష్ట, పరపతి క్షీణించాయని అర్ధమౌతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.