విఫలమవుతున్న సి.పి.ఎం. వ్యూహాలు!

Publish Date:Apr 25, 2012

Advertisement

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఎన్నికల్లో పొత్తులు లాభసాటిగా లేవని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ప్రకటించడాన్ని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు అంటూ దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒకదానితో పొత్తుకుడుర్చుకుంటూ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చి, నేడు ఆకస్మికంగా లాభసాటి కాదని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

1994 ఎన్నికల్లో 16 స్థానాల్లో సిపిఎం పార్టీ విజయం సాధించింది. ఆనాడు తెలుగుదేశం పార్టీతో తమ ఎన్నికల పొత్తు వ్యూహం ఫలించినట్లు సిపిఎం నేతలు ప్రకటించారు. ఆ తరువాత విద్యుత్ ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఆ పొత్తును కూడా సమర్థించుకొంది. గత ఎన్నికల్లో (2009) తెలుగుదేశం, టి.ఆర్.ఎస్.లతో పొత్తు కుదుర్చుకుంది. ఆ పొత్తును కూడా సమర్థించుకున్నప్పటికీ వాస్తవంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడంతో బి.వి. రాఘవులు ఆశ్చర్యానికి గురయ్యారు.

 

 

పొత్తులో ఎక్కువస్థానాలు పొందితే ఎత్తుగడ విజయం సాధించినట్టు ... ఓడిపోతే పొత్తు ఎత్తుగడ విఫలమైనట్టు భావించడం ఎటువంటి రాజకీయమో పరిశీలకులు అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఉప ఎన్నికల్లో సిపిఎం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, స్వాతంత్రంగానే అయిదు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగే మొత్తం స్థానాలు 18, వీటిలో అయిదు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తే మిగిలిన స్థానాల అంగటి ఏమిటని? ఈ స్థానాల్లోని సిపిఎం అభిమానులు ఓటు చేయడం బహిష్కరించాలా? లేకపోతే తమకు యిష్టమైన పార్టీకి ఓటు చేసుకోవచ్చునా? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు
సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది.
ఆర్యవైశ్యులు సౌమ్యులు.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. రుద్రారం వద్ద మృతదేహం..!
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.