లడాయిలు తప్పనిసరి!

Publish Date:Sep 12, 2012

Advertisement

 

పార్టీ అయినా అప్పుడప్పుడు ఆ పార్టీలోని కొందరివల్ల ఇబ్బందులు పడకతప్పదు. అది తప్పనిసరి. కాని కాంగ్రెస్‌పార్టీలో మాత్రం ప్రతి విషయంలోను నాయకుల మధ్య లడాయిలు తప్పవు. అసలు లడాయిలు లేందే ఆ పార్టీలోని నాయకులకు అస్సలు తోచనే తోచదు! పబ్లిసిటీ కోసం కూడా లడాయిలు సృష్టించుకుంటారనడం సత్యదూరమేంకాదు! ఇటీవల లేక్‌వ్యూ అతిథి గృహంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ అజాద్‌ను పెద్దపల్లి ఎం.పి. వివేక్‌, విజయవాడ ఎం. లగడపాటి కలిశారు.

 

 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమని కనుక ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని వివేక్‌ కోరగా, లగడపాటి తెలంగాణా ఇస్తేనే కాంగ్రెస్‌ నష్టమని అనడంతో వివేక్‌, లగడపాటి మధ్య లడాయి ప్రారంభమై తెలంగాణా విషయంలో ఎందుకు అడ్డుపడుతున్నారని, విజయవాడ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసుకుంటే మీకొచ్చే ఇబ్బంది ఏంటని వివేక్‌ అంటే, పెద్దపల్లిని రాజధానిగా చేసి తెలంగాణా రాష్ట్రం ఇస్తే తమకేమి అభ్యంతరం లేదని లగడపాటి ఎద్దేవా చేసినట్లు తెలిసింది. దీని బట్టి ఏం అర్ధమయిందయ్యా అంటే ఏ విషయంలోనైనా ఆ పార్టీలో లడాయిలు లేందే పొద్దుపోదు. లడాయిలు లేంది పార్టీ లేదు, లడాయిలంటే ఇష్టపడని నాయకులు ఈ పార్టీలో మమేకం కాలేరని అర్ధమవుతోంది.

By
en-us Political News

  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాఖీ పండుగ  సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటీ ద్వారా  వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది. 
హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపిస్తున్న పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది.
హానగరం  పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను  పరిశీలించిన ముఖ్యమంత్రి,  అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.
సిగరెట్‌ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..!
రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరిలు రాణి, విమల రాఖీలు కట్టి   శుభాకాం క్షలు తెలిపారు.  అలాగే మంత్రి సోదరులు   అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారు రాఖీలు కట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు.  గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
సీఎం రేవంత్‌తో లండన్ లాలూచీ.. బీజేపీతో హరీశ్ మిలాఖత్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.