కిరణ్ కు అధిష్టానం బాసట?
Publish Date:Apr 3, 2012
Advertisement
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య ఏర్పడిన వివాదంలో అధిష్టానం కిరణ్ కు బాసటగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఇటువంటి పరిణామాలను ఊహించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఎంపిలను పార్టీలో నెంబర్ టూ లాంటి ప్రణబ్ ముఖర్జీ వద్దకు రాయబారం పంపారు. వీరు చెప్పినదంతా విన్న ప్రణబ్ కిరణ్ కుమార్ కు సానుకూలంగా మాట్లాడారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తక్కువ అంచనా వేశారు. కిరణ్ బలహీనుడని ఆయనకు మద్దరు ఇచ్చేవారు ఎవరూ లేరని బొత్స మొదటినుంచి భావిస్తూ వచ్చారు. దీనికి తోడు తన బలాన్ని కూడా బొత్స ఎక్కువగా అంచనావేసుకున్నారు. అంతేకాక పిసిసి అధ్యక్షుడైనప్పటి నుంచి కిరణ్ కు వ్యతిరేకంగా తన వర్గాన్ని కూడగట్టడానికి బొత్స ప్రయత్నించారు. సమయం దొరికినప్పుడల్లా కిరణ్ ను ఇరుకున పెట్టాలని భావించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే బాధ్యత తీసుకోవాలంటూ బొత్స తన వర్గంతో ప్రకటనలు చేయించడం కిరణ్ కుమార్ కు సహజంగానే ఆగ్రహం కలిగించింది. దీంతో ఆయన బొత్స పై ఏసిబి అస్త్రాన్ని ప్రయోజించి ఆయనకు దిమ్మతిరిగిపోయేలా చేశారు. ఈ దెబ్బతో విలవిలాడిన బొత్స అధిష్టానాన్ని శరణువేడటానికి ప్రయత్నించారు. ఇక్కడ కూడా ఆయనకు పెద్దగా మద్దతు లభించదని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగిన వైనాన్ని ఒకసారి పరిశీలిస్తే వారంతా చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతారని అర్థమవుతుంది. ఇదే జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగలికారు. అలాగే పెద్దగా ప్రజాదరణ లేని కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ కాగలిగారు. ఆ తరువాత అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని పొందారు. ఆయన పదవిని పొందినవైనం కాకలు తీరిన కాంగ్రెస్ యోధులకు కూడా షాక్ నిచ్చింది. ఆ తరువాత సకలజనుల సమ్మె సమయంలో కూడా ఆయన నిగ్రహంతో వ్యవహరించి సమ్మెవిరమణకు ప్రయత్నించారు. దీనిలో సఫలమైన తరువాత రాజీవ్ యువకిరణాల పేరిట లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ కొత్త కథకాన్ని ప్రారంభించారు. అదే సమయంలో తాను గట్టి సిఎంనని, తప్పు ఏ పార్టీవారు చేసినా సహించబోనని నిరూపించేందుకు మద్యం సిండికేట్లపై ఏసిబి దాడులు చేయించారు. ఏసిబి దాడులవల్ల అనేక మంది రాజకీయ నాయకుల భాగోతం వెలుగుచూసింది. అలా వెలుగుచూసిన బాగోతాల్లో బొత్స మద్యం సిండికేట్ ఒకటి. బొత్స మద్యం సిండికేట్ ద్వారా అక్రమంగా కోట్లాది రూపాయలు ఆర్జించారనడానికి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయి. ఈ సాక్ష్యాలనే ఆయన హస్తినలో అధిష్టానానికి అందజేశారు. అధిష్టానం కూడా తప్పుచేసిన వారిని వదిలివేస్తే తమకు రాష్ట్రంలో పరువుపోతుందన్న భయంతో ఉంది. అధిష్టానం కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో బొత్సను పక్కనపెట్టి అవసరమైతే డి. శ్రీనివాస్ కు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/cm-kiran-kumar-reddy-24-13128.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





