6వ తేదీ లోగా జగన్ అరెస్ట్?
Publish Date:Apr 3, 2012
Advertisement
సిబిఐ అధికారులు ఈనెల 6వ తేదీ లోగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్ధులు కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేస్తుండటం విశేషం. ఒకవైపు తాను ఏం తప్పు చేశానని సిబిఐ తనను అరెస్ట్ చేస్తుందని జగన్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన అభిమానులు నిత్యం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం జగన్ ను అరెస్ట్ చేస్తే ఈ నెల 6 వ తేదీలోగా అరెస్ట్ చేయవచ్చని ఈ లోగా అరెస్ట్ కాకపొతే ఆయనను మరెప్పటికీ అరెస్ట్ చేయడం సాధ్యంకాదని అంటున్నారు. 6వ తేదీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నప్పటికీ సిబిఐ అనుబంధ చార్జ్ షీట్ వేసి దానిలో కోర్టుకు సాక్ష్యాలు చూపించే సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యకలాపాలే ఇటువంటి ఊహాగానాలకు కారణమావుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడమే కాకుండా ఆయనకు ప్రముఖులకు కల్పించే వై కేటగిరి భద్రతలు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఇప్పటికే అధ్వాన్నంగా ఉంది. బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారవచ్చునని అధిష్టానం భయపడుతోంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వ్యూహాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఎవరో ఒక ప్రముఖుడ్ని అరెస్ట్ చేస్తారనుకుంటున్న తరుణంలో ఆయన అనామకులను అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా అటువంటిదే జరగవచ్చునన్న వదంతులు కూడా వినవస్తున్నాయి. జగన్ భార్య భారతిని కూడా అక్రమాస్తుల కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. అందువల్ల ఆమెను ఇంటరాగేషన్ కు పిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు. జగన్ ను అరెస్ట్ చేయకుండా భారతిని ఇంటరగేట్ చేయడం ద్వారా జగన్ వర్గాన్ని ఆందోళనలకు గురిచేయాలన్నై లక్ష్మీనారాయణ వ్యూహంగా తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-chief-jagan-mohan-reddy-24-13129.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





