చిరంజీవి 150 సినిమా చేస్తే మరి ప్రజలు, కాంగ్రెస్ సంగతి?

Publish Date:May 12, 2015

Advertisement

 

ఇప్పడు అందరూ చిరంజీవి 150 సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. ఇక ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేదు. ఆ సినిమా గురించి ట్వీటర్, ఫేస్ బుక్ వంటి సామాజిక వెబ్ సైట్లలో చాలా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో కూడా అదే చర్చ. కానీ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన పూర్తి సమయం వెచ్చించకుండా ఈవిధంగా సినిమాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసం? ఈ ప్రశ్న ఆయన వంటి పార్ట్ –టైం రాజకీయ హీరోలందరికీ కూడా వర్తిస్తుంది. ఆయన అసలు రాజకీయాలలోకి రాకుండా సినీ పరిశ్రమలోనే కొనసాగుతూ ఆ సినిమాను తీస్తున్నట్లయితే ఆయనను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదు. లేదా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి సినిమాలు చేసుకొన్నా ఎవరూ అడిగేవారు కాదు.

 

 

తమ సినిమాలలో ప్రజల సంక్షేమం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి కాశీకి వెళ్ళిపోగల చిరంజీవి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నిజంగానే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన సినిమాలు త్యాగం చేయలేరా? రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. రాష్ట్రం మళ్ళీ నిలద్రోక్కుకొని లేచి నిలబడాలంటే కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం. కానీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి కొన్ని అంశాలలో చాలా జాప్యం జరుగుతోంది. కనుక రాష్ట్రానికి చెందిన ప్రతీ ఒక్క యంపీ కూడా పార్టీలకి అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఏదో మొక్కుబడిగా పార్లమెంటు సమావేశాలలో పాల్గొనడమే తప్ప ఏనాడు వాటి గురించి కేంద్రాన్ని అడిగింది లేదు. కనీసం సమావేశాలకు హాజరయిందీ లేదు. ఎందుకంటే ఆయన తన 150 సినిమా నిర్మాణం గురించి చాలా బిజీగా ఉన్నారు.

 

పార్లమెంటుకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి లేదా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడక పోయినా కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా’ కోసం గుంటూరులో చేసిన ఒక్కరోజు దీక్షకు మాత్రం ఎందుకో హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా లభించే అన్ని సౌకర్యాలను నిరభ్యంతరంగా వాడుకొంటున్న చిరంజీవి మరి ప్రజా ప్రతినిధిగా తన విధులను ఎందుకు నిర్వర్తించడం లేదు? అని ప్రశ్నిస్తే ఆయన వీరాభిమానులకు చాలా కోపం రావచ్చును. ఇంతకు ముందు సినిమాలు మాత్రమే చేసుకొంటున్నప్పుడు ఆయనను ఎవరూ ఇటువంటి ప్రశ్న అడగలేదు. కానీ ఆయన ఇప్పుడు ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా జీతభత్యాలు, సకల సౌకర్యాలు పొందుతున్నప్పుడు ఆయనకు ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో అప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.

 

ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోయినా, రాజకీయాలలో తనకీ స్థాయి కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చుకొని ఉన్నా బాగుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దానిని గాలికి వదిలి తన 150 సినిమా చేసుకొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆయన వంటి అత్యంత ప్రజాధారణ కలిగిన వ్యక్తి మరొకరు కనబడకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయనకే ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందనే సంగతి పక్కన పెడితే, ఎన్నికలలో ఓడిపోయిన తరువాత చాలా దయనీయంగా మారిన తన పార్టీని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నించకుండా తన 150వ సినిమా చేసుకోవడానికి వెళ్ళిపోయారు.

 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో గానీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే అప్పుడు కూడా ఆయన పార్టీని ఇదేవిధంగా వదిలిపెట్టి ఉండేవారా? అని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. కనుక ఆయన ఒకవేళ మళ్ళీ సినిమాలలో నటించదలచుకొంటే రాజకీయాలకు స్వస్తి పలికితే మంచిది. లేదా రాజకీయాలలో కొనసాగాలనుకొంటే, తన పూర్తి సమయం ప్రజా సేవకే వినియోగించినా అందరూ హర్షిస్తారు. కానీ ఈవిధంగా పార్ట్-టైం ప్రజాసేవ వలన ఇటువంటి విమర్శలకు తావిచ్చినట్లవుతుంది.

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.