గ్రామస్థాయిలో పట్టుకోసం ‘దేశం’ ఆరాటం!....పాదయాత్రల వెనుక లక్ష్యం?
Publish Date:Sep 25, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 117 రోజుల పాదయాత్ర గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి దారి తీయాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబు యాత్రతో పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జి స్థాయిలో ఉన్న వారందరూ ఈ యాత్రతో పాటు కానీ, ముందుగా కానీ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించాలని పార్టీ కేంద్ర పొలిట్బ్యూరో సూచిస్తోంది. ఈ పాదయాత్రల తీరుతెన్నులను పరిశీలిస్తున్న పొలిట్బ్యూరో ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ పట్టు కనుక పెరిగితే 2014 ఎన్నికలను ఎదుర్కొవటం పెద్ద పని కాదు అని భావిస్తోంది. అందుకే ముందుగా ఈ పాదయాత్ర జరిగే అన్ని జిల్లాల్లోని నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబరు 2న చంద్రబాబు పర్యటన అనంతపురం జిల్లా హిందుపురం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో సమాంతరంగా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేయటానికి పర్యటనలు ప్రారంభించాలని పొలిట్బ్యూరో జిల్లా నేతలను ఆదేశిస్తోంది. బాబు పర్యటించే హిందుపురం, కర్నూలు, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులను రాష్ట్ర నేతలు ముందస్తుగా ప్రతీరోజూ సంప్రదిస్తున్నారు. అంతేకాకుండా పాదయాత్ర ప్రారంభమయ్యాక గ్రామాల వారీగా నియోజకవర్గ ఇన్ఛార్జిల పర్యటనల వివరాలు, బాబు పాదయాత్ర తీరుతెన్నులు రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ప్రతీ సోమ, మంగళవారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రత్యేకించి బాబు యాత్ర ఎలా ఉండాలన్న రూట్మ్యాప్ జిల్లా నేతల ఆలోచనలతో రూపుదిద్దుకోవాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అందుకే బాబు కూడా ఆ జిల్లా నేతలతో కలిసి వారిచ్చిన సూచనల ప్రకారం పర్యటించేందుకు సిద్ధపడుతున్నారు. కొన్ని నినాదాల ఆధారంగా గ్రామీణులను తెలుగుదేశం పార్టీవైపు నడిపించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఎన్టీఆర్ హయాం నుంచి అచ్చొచ్చిన ‘నడుస్తోంది రాబందుల రాజ్యం...రాబోయేది రామన్న రాజ్యం’ అన్న నినాదానికి పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అసమర్ధపాలన అంతమొందిద్దాం అన్న నినాదానికి ప్రాధాన్యత ఇస్తోంది. బిసి డిక్లరేషను ప్రకటించినందున చట్టసభల్లో పెరగాలి బిసిల భాగస్వామ్యం అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని నినాదమిస్తోంది. ఇలా నినాదాలు కొత్తఅంశాలతో బాబు పాదయాత్రను హుషారెక్కించేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తులు చేస్తోంది. ఏమైనా ఈ అవకాశం అధికారానికి ఉపయోగపడాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ప్రయత్నిస్తోంది.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-24-17654.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





