ఇసుక మాఫియాకు షాకిచ్చిన కొత్త పాలసీ ?
Publish Date:Sep 25, 2012
Advertisement
ఇసుక తవ్వకాలు, అమ్మకాలు విషయంలో అక్రమాలను ప్రభుత్వం కొత్తపాలసీని ద్వారా అదుపు చేయనుంది. ఈ పాలసీ వల్ల అక్రమాలు జరిగే అవకాశాలు తగ్గుతాయని రాష్ట్రప్రభుత్వం నమ్మబలుకుతోంది. రోజూ దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకున్నామని చెప్పుకునే వాతావరణం స్థానంలో సామాన్యుడు కూడా స్వేచ్ఛగా ఇసుకను వినియోగించుకునే స్థాయికి చేరతాడని ఆశిస్తోంది. ముందుగా ప్రకటించినట్లే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ ఇసుకను నిత్యవసరం కింద పరిగణించింది. రీచ్ల్లో రాజ్యమేలుతున్న మాఫియా పక్కకు తప్పుకునే పరిస్థితులను ప్రభుత్వమే కల్పించింది. ఇసుకరీచ్లకు టెండర్కమ్ పబ్లిక్ ఆక్షన్ పద్ధతిని ఆపేసి లాటరీల ద్వారా కేటాయింపులు చేయనున్నది. క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.325గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరకు 20శాతం మించకుండా జిల్లా అధికారులే ధరను శాసిస్తారు. తవ్వకాల్లో పరిమితి విధించే వాల్టా చట్టం అమలు చేస్తారు. యంత్రాల వాడకాన్ని నిషేధిస్తారు. పీసా చట్టం 1966 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఇసుకరిచ్లను ఎపీఎండీసీ, ఐటీడీఏ సహకారంతో గ్రామసభల్లో ఆమోదం పొందిన సొసైటీలు నిర్వహిస్తాయి. నీటిలోపల ఇసుకతవ్వకాలను రిజిస్టర్డ్ బోట్స్, మైన్స్ సొసైటీలకు లాటరీ పద్దతిలో కేటాయిస్తారు. రిజర్వాయర్లతో డీసిల్టింగ్ ద్వారా ఇసుకను ఇరిగేషన్శాఖ వెలికి తీస్తుంది. ఈ ఇసుకను ప్రభుత్వపనులకు వినియోగిస్తారు. పట్టాభూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు సీనరేజి ఫీజు చెల్లించి రైతులే అనుమతి పొందాలి. మండల పరిధిలో ఉన్న చిన్నచిన్న నదులు, వాగుల్లో ఉన్న ఇసుకను స్థానిక అవసరాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీనరేజీ ఫీజు లేకుండా ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు ధృవీకరణతో ఇసుకను ఉచితంగా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర సరిహద్దులకు ఇసుకరవాణా నిషేధించారు. ఇతరరాష్ట్రాలకు ఇసుకను రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేస్తారు. ఇసుకసీనరేజీ ఫీజులు నూరుశాతం జిల్లాపరిషత్తు జనరల్ ఫండ్స్ ఖాతాలో జమ చేస్తారు. దీనిలో 25శాతం జిల్లా పరిషత్తు, 50శాతం మండలపరిషత్తులు, 25శాతం గ్రామపంచాయతీలు వాటాగా పొందుతాయి. ఇప్పుడు రాజధానికి తరలిస్తున్న పది ఘనపుమీటర్ల ఇసుక ధర 16నుంచి 18వేల రూపాయలు ఉంటే కొత్త పాలసీ ప్రకారం ఏడు నుంచి ఎనిమిదివేల రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఐదు హెక్టార్లలోపు రీచ్లకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 107 ఇసుకరీచ్లను తవ్వకాలకు అనుకూలమైనవని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్నవి 77రీచ్లు మాత్రమే. నూతనవిధానంలోకి రావటానికి ఆసక్తి చూపకపోతే 42 రీచ్లకు గనులశాఖ డబ్బు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమైనా ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు, టెండరుదారులు కొత్తపాలసీ పర్వాలేదంటూ ఊపీరిపిల్చుకుంటున్నారు. నిర్మాణాలు పూర్తి చేసేందుకు పాలసీని వెంటనే అమలులోకి తేవాలని వారు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/government-new-policy-24-17655.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





