మార్పు విద్యార్ధుల్లో రావాలి!
Publish Date:Sep 24, 2012
Advertisement
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలకు తావులేకుండా పటిష్టచర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎస్పీ, పోలీస్ కమిషనర్లకు డిజిపి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అలాగే ర్యాగింగ్ బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని, ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ర్యాగింగ్ జరక్కుండా చర్యలు తీసుకోవాలని, వైస్ ఛాన్సలర్, ప్రిన్సిపాల్లతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని ఓ సర్క్యులర్లో సూచించారు. నిజంగా హర్షించదగ్గ పరిణామం. అలాగే గతంలో జరిగిన ర్యాగింగ్పై చర్యలు తీసుకుంటున్నామని, ఇక ఎక్కడ ర్యాగింగ్లు జరగవని అన్నారు. కాని జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. కొత్త విద్యార్ధులను పరిచయం చేసుకోవడమంటే వారంతా ఎందుకు కాలేజీలో చేరమా? అని బాధపడేలా వుండకూడదు. తల్లిదండ్రులకు దూరంగా చదువుకుంటున్నా మాకు ఓ అండ వుందన్న సంతృప్తితో కాలేజీలకు రావాలి. అలా వారు రావాలంటే ఆయా సంస్థల్లోని విద్యార్ధుల్లో మార్పు రావాలి. ర్యాగింగ్ అంటే మా జన్మహక్కు అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తుంటారు. కాలేజీల్లోకాని, విద్యార్ధులకు సంబంధించిన హాస్టళ్ళలోకాని ర్యాగింగ్ అన్నది జరగకుండా వుండాలంటే అది ఎంత ఇబ్బందికరమో వారికి తెలియాలి. మా వెనుక అండవుందని కొందరు ప్రవర్తిస్తుంటారు. అటువంటివారికి ఆయా పెద్దలు బుద్ధిచెప్పిననాడు ర్యాగింగ్ అన్నది విద్యాసంస్థల్లో జరగదు. కేవలం మగపిల్లలే ర్యాగింగ్ చేస్తారనుకుంటే పొరపాటే! ఆడపిల్లలు సైతం ర్యాగింగ్ చేసిన సంఘటనల కథనాలు సామాన్య ప్రజలు చదివారు కూడా! ర్యాగింగ్ జరగకుండదంటే ముందు విద్యార్ధుల్లో మార్పువచ్చేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కొందరు విద్యార్ధుల వెనుక వుండి నడిపించే వారు తెలుసుకోవాలి. మరో విద్యార్ధిని ర్యాగింగ్ చేసేముందు ఆ స్థానంలో మనమే ఉంటే ఎలా ఫీలవుతామో ఆలోచించుకుంటే మంచిది.
http://www.teluguone.com/news/content/raging-24-17653.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





