ఏపీలో జనగణన షురూ

Publish Date:Apr 16, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో భారత జనగణన-2027 ప్రక్రియ గురువారం (ఏప్రిల్ 16)నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక సేకరణగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమం, చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. తొలి దశలో  ఇంటి వివరాల సేకరణ , గృహ గణన పనులు చేపట్టారు.  రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ అమరావతి సచివాలయంలో  బుధవారం (ఏప్రిల్ 15) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు  స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని  అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.  

గురువారం (ఏప్రిల్ 16)  నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని వారి కోసం ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి సమాచారాన్ని సేకరిస్తారన్నారు.   డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమం కోసం  గణన విధుల్లో పాల్గొనే వారిలో 80 శాతం మంది గ్రామ,  వార్డు సచివాలయ ఉద్యోగులే ఉండటం విశేషం. మిగిలిన 20 శాతం విధులను ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి కేటాయించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం నేరుగా డిజిటల్ సర్వర్లలో నిక్షిప్తం కానుంది. ప్రజలు అందించే వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయనీ, డేటా భద్రతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే..  గణన ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా,  అధికారుల విధులకు ఆటంకం కలిగించినా  చర్యలు తప్పవని ఈ సందర్భంగా జె. నివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన వివరాలు అందించాలని కోరారు.

రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ డేటా ఆధారంగానే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఏపీలో ప్రారంభమైన ఈ డిజిటల్ జనగణన ప్రక్రియ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఇదే తరహా విధానానికి ఇది ఒక రోడ్ మ్యాప్‌గా నిలిచే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.  

By
en-us Political News

  
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో పునరుద్ఘాటించారు. తనపై ఇంత పెద్ద అభియోగం రావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలకు పూర్తిగా సహకరిస్తానన్న మంగ్లీ, ఈ ఫైనాన్స్ చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదానికి తనకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
వర్క్ ప్లేస్ సమానత్వం అన్నది ఒక కంపెనీ సమస్య కాదు, దేశ భవిష్యత్తు ఈ ఆరోపణలు నిర్ధారించని వాంగ్మూలాలు అయినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు.
నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
ప్రమాద సమయంలో బోలేరో వాహనంలో మొత్తం 21 మందిఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
14 ఏళ్ల ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి బుధవారం స్కూలుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో రెండు వేర్వేరు తరగతి గదుల్లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా పేలిన తూటాలతో విద్యార్థులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా బలగాల కదలికలను పర్యవేక్షించేందుకు ఇరాన్ ఆధునిక సాంకేతికతను ఆశ్రయించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన ఒక నిఘా ఉపగ్రహాన్ని ఇరాన్ ఉపయోగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఎర్త్ ఐ కంపెనీ అభివృద్ధి చేసిన టీఈఈ 01బి శాటిలైట్ ద్వారా ఇరాన్ సక్సెస్ ఫుల్ గా అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది.
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది.
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.