పాముకు పాలు పోస్తున్న చంద్రబాబు

Publish Date:Mar 14, 2025

Advertisement

పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు  తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు. వైసీపీ నేతలను దగ్గరకు రానీయొద్దు.. తెలుగుదేశం నేతలను ప్రలోభపెట్టాలని వైసీపీ నేతలు,  వారి సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారు, మనతోనే వాళ్ల పనులు చేయించుకుంటారంటూ పార్టీ నేతలకు చాలా పెద్ద ఎత్తునే హితబోధ చేశారు చంద్రబాబు. అలాంటి వాళ్లను దగ్గరకు రానీయొద్దంటూ పెద్ద లెక్చరే పీకారు. 

కానీ అదే చంద్రబాబు రెండు రోజులు తిరిగే సరికి.. వైసీపీతో అంటకాగిన వారిని,  గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వారికి ఆర్థికంగా భారీ మొత్తంలో లాభాలు తెచ్చిపెడుతున్నారు. పెద్ద ఎత్తున భూములూ కట్టబెట్టేస్తున్నారు.

తాజాగా జరిగిన ఎస్ఐబీపీ సమావేశంలో గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం నుంచి, ఆ రంగంలోని వివిధ కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీల నుంచి రావాల్సిన అమ్యామ్యాలను వసూలు చేసి పెట్టిన వారికి పెద్ద పీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం.  షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యానికే చెందిన మరో సంస్థ ఇండోసోల్ కంపెనీకి భారీ ఎత్తున భూములు కట్టబెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58469 కోట్ల రూపాయలతో ఇండోసోల్ ప్రాజెక్టు పెట్టుబడి పెడుతుందని.. దానికి ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎస్ఐపీబీ సమావేశంలో 119659 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతున్న వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇందులో 58469 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్న ఇండోసోల్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఓ విధంగా చెప్పాలంటే ఇండోసోల్ కోసం లేటెస్ట్ ఎస్ఐపీబీ సమావేశాన్ని ప్రభుత్వం పెట్టినట్టుగా కన్పిస్తోంది.

 ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పిన ఇండోసోల్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 8348 ఎకరాల భూమిని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో కేటాయింపులు జరుపుతున్నారు. ఇక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నందుకు ప్రభుత్వం వైపు నుంచి భారీగా ఆర్థిక, ఆర్థికేతర ప్రొత్సహాకాలివ్వాలని ఇండోసోల్ కోరింది. ఆర్థిక ప్రొత్సహకాలు ఎంతో తెలుసా.. ఏకంగా 41254.50 కోట్ల రూపాయలు. ఇది కాకుండా,  ఆర్థికేతర ప్రొత్సహకాలు ఉన్నాయి. వీటిల్లో ఇండోసోల్ పెట్టిన మెజార్టీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ స్థాయిలో జగన్ కు బినామీ అనుకున్న సంస్థకు ఎలా కట్టబెడతారనేది ఇప్పుడు తెలుగుదేశం సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.

 పోనీ ఇదేదో పై స్థాయిలో జరుగుతోంది.. చూసీ చూడనట్టు పోదామన్నా.. వీల్లేని పరిస్థితులు కల్పిస్తోంది ఇండసోల్ సంస్థ. ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి నేరుగా చేస్తున్నారో.. లేక ఆయన పేరుతో ఎవరైనా చేస్తున్నారో తెలియదు కానీ,  తెలుగుదేశం పార్టీకి చెందిన   వారు.. పార్టీ సానుభూతి పరులు విద్యుత్ కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన టెండర్లను వేస్తే వాటిని అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు పెత్తనం చేస్తున్నారట. సదురు సంతోష్ రావు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భక్తుడు. ఈ సంతోష్ రావు చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కుతున్నాయి. హిందూపురం తోపుదుర్తి గ్రామంలో విశ్వేశ్వర రెడ్డి సోదరుడు బ్రహ్మానంద రెడ్డి విద్యుత్ కాంట్రాక్టర్. దీంతో విశ్వేశ్వర రెడ్డి అండతో.. సంతోష్ రావు సహకారంతో సదురు బ్రహ్మానంద రెడ్డికే పనులు దక్కుతున్నాయట. తెలుగుదేశం పార్టీకి  చెందిన క్లాస్ వన్ కాంట్రాక్టర్ గంగాధర నాయుడు విద్యుత్ కాంట్రాక్టులకు టెండర్లు వేయాలన్నా.. వేయనీయకుండా అడ్డుకుంటున్నారట.

మళ్లీ చంద్రబాబు చెప్పిన పాముకు పాలు పోస్తే సామెతను ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తోంది. పై స్థాయిలో విశ్వేశ్వర రెడ్డిని బలోపేతం చేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో టీడీపీ వాళ్లను కాదని.. విశ్వేశ్వర రెడ్డి తమ్ముడిని బలోపేతం చేస్తున్నారు. వీళ్లు ఆర్థికంగా బలోపేతమై.. అమరావతిలో కూర్చొన్న విశ్వేశ్వర రెడ్డి చంద్రబాబకు, లోకేషుకు ఎర్త్ పెట్టడమో,  హిందూపురంలో బాలయ్య సీటుకు ఎర్త్ పెట్టడమో చేయరని గ్యారెంటీ ఏంటీ అనే చర్చ జరుగుతోంది. పాము పాలు థియరీ చెప్పడం కాదు.. పాటిస్తే ఇంకా బాగుంటుందని తెలుగుదేశం కేడర్.. లీడర్లు విసుక్కుంటూ సణుక్కుంటున్నారట.

By
en-us Political News

  
జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పిఠాపురంలో శుక్రవారం (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు, నిప్పు వంటి వారు. విమర్శల స్థాయిని వారిరువురూ దూషణల స్థాయికి దిగజార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతుంటారు.
బంగారం తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా? .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు.
రాజ్ కసిరెడ్డి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు.
అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు.
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
  ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.