టార్గెట్ మిథున్ రెడ్డి.. భుజం కసిరెడ్డిది!

Publish Date:Mar 14, 2025

Advertisement

ఎవరీ రాజ్ కసిరెడ్డి..?

జగన్ దగ్గర రాజ్ కసిరెడ్డి అంత ప్రాపకం ఎలా సంపాదించారు..?

పెద్దిరెడ్డి అండ్ సన్స్ కు రాజ్ కసిరెడ్డికి ఉన్న లింకులేంటీ..?

జూనియర్ పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..?

రాజ్ కసిరెడ్డి.  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు. దీంతో జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని వైసీపీలో నెంబర్ టూగా వ్యవహరించి.. ఇప్పుడు రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి చెప్పేశారు. అంటే లిక్కర్ స్కాంను జరిగిందని నిర్ధారించారు విజయసాయి రెడ్డి. ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ప్రస్తావించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు..? అనే చర్చ జరుగుతోంది.

కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యనభ్యసించాడని వైసీపీ నేతలు చెబుతారు. ముందుగా ఐ-ప్యాక్ టీంలో ఓ సాధారణ మెంబరుగా ఉండేవారట. ఆ తర్వాత తనకున్న సామాజిక వర్గం నేపథ్యం చూపించారో.. లేక తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారో కానీ.. రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారని వైసీపీ వర్గాలే చెబుతాయి. అదీ ఎంతగా అంటే.. పార్టీలో చాలా కాలం ఐటీ వింగ్ లో పని చేసిన వారికి కూడా ఇవ్వని ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి కట్టబెట్టేటంతగా ఎదిగిపోయారు రాజ్ కసిరెడ్డి.  అయితే ఐటీ సలహలకంటే.. రాజ్ కసిరెడ్డి సంపద సృష్టి సలహలే ఎక్కువ ఇచ్చినట్టున్నారు.. ఎక్సైజ్ శాఖ నుంచి ఎంత వరకు పిండొచ్చు.. ఎన్నిరకాలుగా పిండొచ్చు.. ఏయే దారుల్లో పిండొచ్చనే కథా కమామిషు మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారానే జరిగిదని టాక్.

డబ్బులు పిండుకోవడం.. ఆ డబ్బులను మళ్లించడం.. ఆ డబ్బులను అనుకున్న గమ్యస్థానానికి చేర్చడం వంటి పనులను తూచా తప్పకుండా చేసింది అంతా రాజ్ కసిరెడ్డేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా చెప్పేశారు. అయితే రాబోయే ప్రమాదాన్ని రాజ్ కసిరెడ్డి ముందే గ్రహించాడో..  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాడో కానీ.. ఏడాదిన్నరకు ముందే వైసీపీ క్యాంప్ నుంచి రాజ్ కసిరెడ్డి సైలెంటుగా జంప్ అయిపోయినట్టు తెలుస్తోంది. అయినా లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉండడంతోపాటు.. లిక్కర్ స్కాం సూత్రధారి-పాత్రధారి కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడంతో మరోసారి రాజ్ ఎపిసోడ్ మళ్లీ తెర మీదకు వచ్చింది.

ఇదంతా ఓ ఎత్తు అయితే.. ఇప్పుడు లిక్కర్ స్కాం రాజ్ కసిరెడ్డి ఎంత వరకు దొరుకుతాడో ఏమో కానీ.. జూనియర్ పెద్దిరెడ్డి అంటే.. మిధున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు సమాచారం. ఈ మద్యం కిక్ బ్యాగ్స్ వ్యవహరంలో తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ మిధున్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్పరెన్స్ కూడా పెట్టాడు. దీంతో తన అరెస్ట్ గురించి మిధున్ రెడ్డి ముందుగానే ఊహించినట్టున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖకు మంత్రిగా నాటి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు. కానీ ఆయన్ను డమ్మి చేసి ఎక్సైజ్ శాఖకు అనధికారిక మంత్రిగా చెలాయించింది పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డేనని అందరికీ తెలిసిందేనంటున్నారట. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి ప్రస్తావించడం.. అదే రోజున మిధున్ రెడ్డి స్పందించడం వంటివి చూస్తుంటే.. మిధున్ రెడ్డికి కటకటాల కష్టాలు తప్పవేమోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 
ఇదే సందర్భంలో మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పని చేసిన ఓ ఉద్యోగి అప్రూవర్ గా మారినట్టు సమాచారం. ఇదే నిజమే అయితే.. అతి త్వరలో మిధున్ రెడ్డి కేంద్రంగా అతి పెద్ద డెవలప్మెంట్ జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.

By
en-us Political News

  
జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పిఠాపురంలో శుక్రవారం (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు, నిప్పు వంటి వారు. విమర్శల స్థాయిని వారిరువురూ దూషణల స్థాయికి దిగజార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతుంటారు.
బంగారం తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా? .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు.
పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు.
అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు.
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
  ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.