political-news-img

తొలి దశ జనగణన షురూ!

దేశవ్యాప్తంగా 16వ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. తొలి దశలో భాగంగా గృహగణన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎనిమిదోదైన ఈ సెన్సస్‌ను తొలిసారిగా పూర్తి డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నారు. జనగణనలో సేకరించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, సెన్సస్‌ కమిషనర్‌ మృత్యుంజయ్‌కుమార్‌ నారాయణ్‌ చెప్పారు. ఈ వివరాలను ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలతో పంచుకోరనీ, వీటిని న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా కూడా పరిగణించరని తెలిపారు. ఈ డేటా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదన్నారు. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి కోత విధించడం లేదా కొత్తవి మంజూరు చేయడం కూడా జరగదని తెలిపారు.

Publish Date: Apr 1, 2026 6:26PM

political-news-img

ఈ సేవా కేంద్రాల్లో సర్వీసు చార్జీల పెంపు.. నేటి నుంచే అమలు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన యూజర్ చార్జీలను పెంచుతూ రేవంత్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సేవలపై సుమారు 50 శాతం వరకూ ధరలు పెంచారు. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి యూజర్ చార్జీలుగా రూ.80 చేశారు. జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్‌ ఇవ్వడానికి రుసుం రూ.62 చేశారు. ఈ పెంచిన యూజర్ చార్జీలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజైన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, గత కొన్నేళ్లుగా చార్జీల సవరణ జరగకపోవడంతో మీసేవ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Publish Date: Apr 1, 2026 6:20PM

political-news-img

చంద్రబాబుపై జగన్ అస్త్రం మావిగన్ !.. ఏదైనా జగన్ మూడుముక్కలాట వదలడం లేదుగా?

జ‌గ‌న్ కి మ‌ళ్లీ మూడొచ్చింది. మొన్న‌టి వ‌ర‌కూ క‌ర్నూలు- అమ‌రావ‌తి- విశాఖ అంటూ మూడు రాజ‌ధానులంటూ మూడుముక్కలాట ఆడిన జగన్ ఇప్పుడు మ‌రో మూడు ముక్క‌లాటకు తెరతీశారు. అదే మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు. దీనికే ఆయ‌న సినిమా ఫ‌క్కీలో మావిగ‌న్ అంటూ జ‌గ‌న్ అనే అర్ధ‌మొచ్చేలా పేరు పెట్టారు. పేరు వ‌ర‌కూ ఓకే... ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న అన్న‌మాట‌ల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే త‌న‌కే సంకుచిత‌మైన మ‌న‌స్త‌త్వ‌మే ఉంటే అమ‌రావ‌తిని ఎందుకు లెజిస్లేటివ్ క్యాపిట‌ల్ చేస్తాను? అక్క‌డే స్థ‌లం కొన్ని ఇల్లెందుకు క‌డ‌తాను? తానే క‌దా మొద‌ట అమ‌రావ‌తిలో ఇల్లు క‌ట్టుకున్నది అన్నారు. త‌న‌కే సంకుచిత మ‌న‌స్త‌త్వ‌మే ఉండి ఉంటే, రాయ‌ల‌సీమ‌లోనే రాజ‌ధాని క‌ట్టేవాడ్ని క‌దా? అని కూడా ప్రశ్నించారు. త‌న‌కెలాంటి సంకుచిత మ‌న‌స్త‌త్వం లేదు కాబ‌ట్టే.. తాను విశాఖ‌ రాజ‌ధాని కావాల‌ని కోరుకున్న‌ట్టు చెప్పారు మావిగ‌న్ రూప‌శిల్పి జ‌గ‌న్. జ‌గ‌న్ త‌న ప్రెస్ మీట్ లో కొన్ని కీల‌క‌మైన కామెంట్లు చేశారు. అందులో మొద‌టిది.. వాళ్లేవిధంగా అసెంబ్లీలో అమ‌రావ‌తే రాజ‌ధాని అని ఒక చ‌ట్టం చేశారో.. మాకు అధికారం వ‌స్తే, అదే అసెంబ్లీని వేదికగా చేసుకుని.. ఆ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఎందుకు చేయ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు? అలా ప్రశ్నించడం ద్వారా తానేమిటో.. తన విధానమేమిటో క్లారిటీ ఇచ్చేశారు. మొన్న‌టి వ‌ర‌కూ విశాఖ విశాఖ అన్న జ‌గ‌న్.. ఇప్పుడు అమ‌రావ‌తిని కొత్త రాజ‌ధాని కారిడార్ లో భాగంగా మ‌చిలిప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరును చేర్చాల‌ని ప్ర‌తిపాదిస్తున్నారు. మ‌రి విశాఖ మీద ఆయ‌న‌కున్న ప్రేమ ఏమైన‌ట్టు? మ‌రో ప‌క్క బొత్స‌, ధ‌ర్మాన ద్వారా ఈ బిల్లును తిరిగి తాము బ్రేక్ చేయ‌గ‌ల‌మ‌ని కూడా చెప్పిస్తున్నారు. అంటే ఎవ‌ర్ని ఎవ‌రిపైకి ఎందుకు ఉసిగొల్పుతున్నారు? దీనంత‌టిని బ‌ట్టీ చూస్తుంటే అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని జ‌గ‌న్ బలంగా కోరుకుంటున్నారని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. అందుకే మావిగ‌న్ అంటూ పిచ్చి ప్ర‌తిపాద‌న‌లు, ప్రేలాప‌న‌లు చేస్తున్న‌ట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ వైఖరితో జగన్ పార్టీ వచ్చే ఎన్నికలలో 11 నుంచి ఒకటికి పడిపోయినా ఆశ్చర్యంలేదంటున్నారు. నలభై శాతం ఓటు బ్యాంకు అంటున్న జగన్ కు ఆ ఓటు శాతం నాలుగుకు పడిపోయేదాకా నిద్రపట్టదా ఏంటని ఎద్దేవా చేస్తున్నారు నెటిజనులు.

Publish Date: Apr 1, 2026 5:37PM

political-news-img

ఇది ఆంధ్రులకు దక్కిన గౌరవం.. చంద్రబాబు

ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారాయన. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు. బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేశారు.

Publish Date: Apr 1, 2026 5:10PM

political-news-img

ఏపీ రాజధాని అమరావతి.. బిల్లకు లోక్ సభ ఆమోదం.. రేపు రాజ్యసభ ముందుకు

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని స్థిరపరుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 కు లోక్‌సభ బుధవారం (ఏప్రిల్ 1) ఆమోదం తెలిపింది. లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది. సభలో ఈ బిల్లుపై సుమారు రెండు గంటల పాటు అర్థవంతమైన చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ బిల్లు ఆమోదం పొందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ 2024 జూన్ 2 నుండి అమల్లోకి వచ్చేలా నిబంధనలను రూపొందించారు. దీనివల్ల గతంలో ఉన్న రాజకీయ అనిశ్చితికి తెరపడి, అమరావతి అభివృద్ధికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోనున్నాయి. రాష్ట్ర విభజన హామీల అమలులో భాగంగా అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది పూర్తిస్థాయి చట్టంగా మారుతుంది. తద్వారా జగన్ తన హయాంలో తీసుకువచ్చిన మూడు రాజధానుల వివాదానికి, విధానానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లౌతుంది. ఈ పరిణామంతో అమరావతి ప్రాంత రైతులు సహా ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Publish Date: Apr 1, 2026 4:00PM

political-news-img

హిట్ అండ్ రన్ కంటే ఘోరంగా వైసీపీ.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేరుగా వైసీపీ పేరు ప్రస్తావించకుండానే కుట్ర రాజకీయాలు చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశంపై వైసీపీ ఆరోపణలను ఖండించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు తమ ప్రభుత్వ హయాంలోనే సిద్ధమయ్యాయని.. కానీ ఆ క్రెడిట్‌ను దక్కించుకోవడానికి వైసీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందన్నారు. మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇతర ప్రాంతాల మత్స్యకారులు ఏపీ జలాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన పేదల సేవలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా పెన్షన్లు అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన హామీ మేరకు 'తల్లికి వందనం, దీపం 2.0' వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇంటింటికీ పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Publish Date: Apr 1, 2026 3:47PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img