తిరుమల పేరు తలిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయి. కోనేటి రాయుడిని దర్శిస్తే చాలు సర్వ కష్టాలు తొలగిపోతాయి. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సేవలు అతి ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైంది గరుడ సేవ. గరుడ వాహనం పై శ్రీ మహావిష్ణువుని తిలకిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. అనేక విధాలుగా ఆ శ్రీమన్నారాయణుని సేవించే వైనతేయడు ఇవాళ వాహనంగా మారి శ్రీవారిని తన భుజస్కంధాల మీద ఎక్కించుకుని నాలుగు మాడవీధుల్లో విహరించబోతున్నాడు. ఈ ఉదయం మోహినీ అవతారం రూపంలో మాధవుడ్ని తిలకించి పులకించిపోయిన భక్తుల రాత్రికి గరుడవాహన సేవను వీక్షించేందుకు తిరుమలకు బారులు కడుతున్నారు. మహోత్కృష్టమైన గరుడ సేవలో పాల్గొనేందుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.ముక్తిని ప్రసాదించే శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలులో పాల్గొని తరిస్తున్న భక్తులు గరుడవాహనసేవను తిలకించేందుకు వేచి చూస్తున్నారు. లక్షగొంతుకల ఒక్కటే జపిస్తున్న గోవింద నామాలతో గిరులు తరులు తరించిపోతున్నాయి.
ఆ వేంకటనాథుడు కూడా తన వైభవాన్ని చూసి తానే పులకించి పోతాడు అన్నట్టుగా ఉంది. మేళాలు తాళాలు చెక్క భజనలు దేవతా మూర్తుల రూపాలు, ఒకటేమిటి సమస్త సంస్కృతి తిరుమాఢ వీధుల్లో కన్పిస్తోంది. గరుత్మంతుడు వేదస్వరూపుడు ప్రతి రోజూ ఉభయ దేవేరులతో కలిసి మాడవీధులకు విచ్చేసే శ్రీనివాసుడు ఒంటరిగా వైనదేయుడుని అధిరోహించి అనుగ్రహించనున్నారు. గరుడ సేవ సందర్భంగా తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన తులసి మాలలు పుష్పమాలికాలను గరుడ వాహనం పై విహరించి శ్రీవారికి అలంకరించటం పరిపాటి. అలాగే నిత్యం మూలమూర్తికి అలంకరించే మకర కంఠి, సహస్రనామ మాల, లక్ష్మీహారాలని కూడా స్వామి వారికి అలంకరించబోతున్నారు. గజ మాలలతో గోపికా వల్లభుడు తిరువీధుల్లో భక్తుల్ని కనువిందు చేయనున్నాడు. కో అని పిలిస్తే చాలు వరాలిచ్చే దేవుడు ఆ కోనేటి రాయుడు అభయముద్రతో అనుగ్రహిస్తాడు శరణు వేడితే చాలు దరిచేరి అండగా ఉంటాడు ఆపదల్లో ఉన్నవారు ఆర్తితో పిలిస్తే చాలు శంఖ చక్ర ధారియై భక్తుల చెంతకు వస్తాడు.
గరుడసేవలో పరమార్థం ఇదే ఇందుకు ఉదాహరణగా గజేంద్ర మోక్షాన్ని ఉదహరిస్తారు. అలాంటి భక్తసులభుడునికి గరుడ సేవ అంటే దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇప్పటికే వీధులన్నీ భక్తులతో రద్దీగా మారాయి. భద్రతా ఏర్పాట్ల కోసం ఐదు వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. రేపు ఎల్లుండి సెలవు రోజులు కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు మూడు కిలో మీటర్ల మేర క్యూలలో భక్తులు వేచి ఉన్నారు. దీనికి తోడు ఆగి ఆగి వర్షం కూడా పడుతుండడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం దాదాపు ముప్పై గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి.బ్రహ్మోత్సవాల్లో పాల్గోనే భక్తుల సంఖ్య ఈ రెండు రోజుల్లో ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brahmotsavam-at-tirupati-2019-25-89760.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.