Publish Date:Jul 13, 2025
ఫ్లయిట్ యాక్సిడెంట్ జరిగిన రెండు మూడు రోజుల తర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇదీ ఒకటి. అదేంటంటే.. ఇంధన స్విచ్ ని ఆన్ చేయకుండానే అహ్మదాబాద్ టు లండన్ ప్లయిట్ టేకాఫ్ అయ్యింది. ఆ మాటకొస్తే ఫ్యూయల్ పాస్ కాకుండా ఫ్లయిట్ ఎలా టేకాఫ్ అయ్యిందని కొందరు అడిగిన ప్రశ్నకు వీరు చెప్పిన సమాధానం ఏంటంటే.. పైపుల్లో మిగులు గా ఉన్న ఇంధనంతో ఫ్లయిట్ పైకి లేచిందనీ.. ఇంతలో ఫ్యూయల్ అందక పోవడం వల్లే.. ఫ్లయిట్ టేకాఫ్ అయిన 32 సెకన్లకే క్రాష్ ల్యాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. టేకాఫ్ టైంలో స్విచ్చులతో ఆడుకునేంత తెలివి తక్కువ పైలెట్ ఎక్కడా ఉండడు. ఇదీ ఎయిర్ ఇండియా ఏఐ 171 క్రాష్ పై .. విడుదలైన ఏఏఐబి ప్రాథమిక నివేదికపై ఏవియేషన్ నిపుణుడు మార్క్ మార్టిన్ స్పందన. రెండు ఇంధన నియంత్రణ స్విచ్లు ఆపేశారని, దీనివల్ల టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు ఆగిపోయాయని అంటోంది ఏఏఐబి రిపోర్ట్. ఒక వేళ అదే నిజమైతే.. 787 బోయింగ్ ఆపరేటర్లపై ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం పడుతుందని అంటారు మార్టిన్.
దానికి తోడు.. కేంద్ర విమానయాన మంత్రి కూడా ఇదే ఫైనల్ రిపోర్ట్ కాదని అన్నారు. దీన్నిబట్టీ చూస్తే ఫ్యూయల్ స్విచ్ మాత్రమే ఈ ప్రమాదంలో కీలకం కాదన్నది తెలుస్తూనే ఉంది. ఇక మార్టిన్ చెబుతున్నట్టు అలా జరిగే అవకాశముందా? అన్నది కూడా అత్యంత ముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఒక ఫ్లైట్ పైలట్ సీట్ లో కూర్చున్నాక.. అన్ని స్విచ్ లను చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. అంతే కాదు.. ఇక్కడ ఒకరికి ఇద్దరున్నపుడు.. అది మరింత ఎక్కువ జాగరూకతతో సాగుతుంది.
ఫ్లయిట్ ఇంధన స్విచ్ ని ఆపుకుని ఒక ఫ్లయిట్ టేకాఫ్ అయ్యిందంటే అది ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఎందుకంటే విమానం నడిచేదే ఇంధనం మీద. అలాంటి ఇంధనం స్విచ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? చూసుకోకుండా ఒకరికి ఇద్దరు పైలెట్లు టేకాఫ్ చేశారంటే.. అది ఫ్లయిట్ మేనేజ్మెంట్ కే కాదు పైలెట్ మేనేజ్మెంట్ కి కూడా అవమానకరమే.
మాములుగా మనం చిన్న కారు తోలితేనే.. అది ఫ్యూయల్ మార్క్ దగ్గర పదే పదే చూపిస్తుంది. అలాంటిది ఒక ఫ్లయిట్ ఇంకెంత ఇండికేట్ చేసి ఉండాలి. అది కూడా అల్ట్రా మోడ్రన్ అయిన బోయింగ్ ఫ్లయిట్ ఎంతగా హెచ్చరిస్తుంది? అన్న దగ్గరే అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్. మరి చూడాలి కాక్ పిట్ లో ఆ ఇద్దరు పైలెట్లు ఇంధన స్విచ్ సంభాషణే ఫైనల్ అవుతుందా? లేక మరేదైనా విషయం బయట పడుతుందా తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aviation-experts-object-on-aaib-report-39-201898.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.