Publish Date:Jul 13, 2025
ఫ్లయిట్ యాక్సిడెంట్ జరిగిన రెండు మూడు రోజుల తర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇదీ ఒకటి. అదేంటంటే.. ఇంధన స్విచ్ ని ఆన్ చేయకుండానే అహ్మదాబాద్ టు లండన్ ప్లయిట్ టేకాఫ్ అయ్యింది. ఆ మాటకొస్తే ఫ్యూయల్ పాస్ కాకుండా ఫ్లయిట్ ఎలా టేకాఫ్ అయ్యిందని కొందరు అడిగిన ప్రశ్నకు వీరు చెప్పిన సమాధానం ఏంటంటే.. పైపుల్లో మిగులు గా ఉన్న ఇంధనంతో ఫ్లయిట్ పైకి లేచిందనీ.. ఇంతలో ఫ్యూయల్ అందక పోవడం వల్లే.. ఫ్లయిట్ టేకాఫ్ అయిన 32 సెకన్లకే క్రాష్ ల్యాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. టేకాఫ్ టైంలో స్విచ్చులతో ఆడుకునేంత తెలివి తక్కువ పైలెట్ ఎక్కడా ఉండడు. ఇదీ ఎయిర్ ఇండియా ఏఐ 171 క్రాష్ పై .. విడుదలైన ఏఏఐబి ప్రాథమిక నివేదికపై ఏవియేషన్ నిపుణుడు మార్క్ మార్టిన్ స్పందన. రెండు ఇంధన నియంత్రణ స్విచ్లు ఆపేశారని, దీనివల్ల టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు ఆగిపోయాయని అంటోంది ఏఏఐబి రిపోర్ట్. ఒక వేళ అదే నిజమైతే.. 787 బోయింగ్ ఆపరేటర్లపై ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం పడుతుందని అంటారు మార్టిన్.
దానికి తోడు.. కేంద్ర విమానయాన మంత్రి కూడా ఇదే ఫైనల్ రిపోర్ట్ కాదని అన్నారు. దీన్నిబట్టీ చూస్తే ఫ్యూయల్ స్విచ్ మాత్రమే ఈ ప్రమాదంలో కీలకం కాదన్నది తెలుస్తూనే ఉంది. ఇక మార్టిన్ చెబుతున్నట్టు అలా జరిగే అవకాశముందా? అన్నది కూడా అత్యంత ముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఒక ఫ్లైట్ పైలట్ సీట్ లో కూర్చున్నాక.. అన్ని స్విచ్ లను చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. అంతే కాదు.. ఇక్కడ ఒకరికి ఇద్దరున్నపుడు.. అది మరింత ఎక్కువ జాగరూకతతో సాగుతుంది.
ఫ్లయిట్ ఇంధన స్విచ్ ని ఆపుకుని ఒక ఫ్లయిట్ టేకాఫ్ అయ్యిందంటే అది ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఎందుకంటే విమానం నడిచేదే ఇంధనం మీద. అలాంటి ఇంధనం స్విచ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? చూసుకోకుండా ఒకరికి ఇద్దరు పైలెట్లు టేకాఫ్ చేశారంటే.. అది ఫ్లయిట్ మేనేజ్మెంట్ కే కాదు పైలెట్ మేనేజ్మెంట్ కి కూడా అవమానకరమే.
మాములుగా మనం చిన్న కారు తోలితేనే.. అది ఫ్యూయల్ మార్క్ దగ్గర పదే పదే చూపిస్తుంది. అలాంటిది ఒక ఫ్లయిట్ ఇంకెంత ఇండికేట్ చేసి ఉండాలి. అది కూడా అల్ట్రా మోడ్రన్ అయిన బోయింగ్ ఫ్లయిట్ ఎంతగా హెచ్చరిస్తుంది? అన్న దగ్గరే అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్. మరి చూడాలి కాక్ పిట్ లో ఆ ఇద్దరు పైలెట్లు ఇంధన స్విచ్ సంభాషణే ఫైనల్ అవుతుందా? లేక మరేదైనా విషయం బయట పడుతుందా తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aviation-experts-object-on-aaib-report-39-201898.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.