రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇవాళ కూడా చర్చలు జరపనుంది. చర్చలు పూర్తి కాకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో జస్టిస్ ధర్మాధికారి కమిటీ సమావేశమైంది. తొలి రోజు చర్చల్లో వ్యవహారం కొలిక్కి రాలేదు. దీంతో శనివారం కూడా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. ఆంధ్ర స్థానికత కలిగిన పదకొండు వందల యాభై ఏడు మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తమ సంస్థల నుంచి ఏక పక్షంగా తొలగించి ఆంధ్రాకు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రస్తుతం చర్చలు జరుపుతున్న ధర్మాధికారి కమిటీ తన పని కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణ ట్రాన్స్ కో ఆకస్మికంగా పదకొండు వందల యాభై ఏడు మందిని మళ్లీ ఆంధ్రాకు కేటాయిస్తూ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయటం వేడి పెంచింది. శుక్రవారం జరిగిన ధర్మాధికారి కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్ర అధికారులు గట్టిగా నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ధర్మాధికారి కూడా తెలంగాణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు పూర్తి కాకుండానే ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆయన వారిని ప్రశ్నించారు. తరువాత జరిగిన చర్చల్లో రెండు రాష్ట్రాలు సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలని ఆయన సూచించారు.
వివాదంలో ఉన్న పదకొండు వందల యాభై ఏడు మంది ఉద్యోగుల్లో ఆరు వందల పదమూడు మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ధర్మాధికారి సూచించారు. ఆంధ్ర అధికారులు అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన ఉద్యోగులేనని వారిని తీసుకుంటే తమపై ఆర్థిక భారం పెరగడమే కాకుండా పదోన్నతల విషయంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఐచ్ఛికాల ప్రకారం వెళ్లాలని మరో మార్గం లేదని తెలంగాణ అధికారులు వాదించారు. మరో రెండు వందల యాభై మంది ఉద్యోగుల విషయంలో కూడా వివాదం ఏర్పడింది. వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని తాము తీసుకునేది లేదని ఆంధ్రా అధికారుల తేల్చిచెప్పగ వారిని మీరే తీసుకోవాలని తెలంగాణ అధికారులు పట్టుబట్టారు. వీటికి పరిష్కారం దొరక్కపోతే తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ఇరు రాష్ట్రాల సీఎంలకు అప్పగించాలని ధర్మాధికారి కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరో పక్క చర్చల తీరు పై ఆంధ్రా విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య స్పష్టమైన కేటాయింపు ఉందని దానికి మించి అదనంగా ఎవరినీ తమ రాష్ట్రానికి తీసుకున్న అంగీకరించేది లేదని ఏపీ అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ రాశాయి. ఎలాంటి సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేయకుండా రెండు వేల పద్నాలుగు జూన్ ఒకటి నాటికి ఉన్న పోస్టుల ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ విద్యుత్ బోర్డు ఏఈల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకు విరుద్ధంగా వెళ్తే నోటీసులు ఇవ్వకుండానే ఆందోళనకు దిగుతామని జరిగే పరిణామాలకు బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి లేఖ రాసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-and-telangana-employees-bifurcation-25-89795.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?